యాంకర్ ఓంకార్.. పరిచయం అక్కర్లేని పేరు. అతడు ఎన్నో ప్రోగ్రాంలకు నిర్మాణ బాధ్యతలను తీసుకున్నాడు. స్టార్ మాలో ప్రసారం అయ్యే ఎన్నో షోలకు అతడు హోస్ట్ గా వ్యవహరించాడు. అతడు తన కెరీర్ మొదట్లో ఎంతో ఇబ్బందులకు ఎదుర్కొన్నాడు.
ట్రెండ్ ను ఫాలో కావడం కంటే.. సెట్ చేయడమే తనకు ఇష్టమని చెబుతాడు ఓంకార్.. అతడి గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం.. తాను సినీ ఇండస్ట్రీకి యాంకర్ అవ్వాలని రాలేదు.. డైరెక్టర్ అవుదామని వచ్చా.. కానీ యాంకర్ ను అయ్యా అంటూ చెప్పాడు. కానీ నేను అనుకున్న దాని కంటే ఎక్కువ పేరు వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇక తనది కాకినాడ అని.. తన తండ్రి డాక్టర్ అని చెప్పుకొచ్చాడు.
తక్కువ ఫీజుతో వైద్యం అందించేవాడని చెప్పాడు. తనేమీ సంపాదించుకోలేదు. కానీ మంచి డాక్టర్గా, మంచి మనిషిగా మాత్రం మిగిలిపోయారన్నాడు. జీ తెలుగులో అవకాశం వచ్చిన తర్వాత యాంకర్గా ‘మాయాబజార్’ చేశానన్నారు. తర్వాత సొంతంగా ఏదైనా చేయలనే ఆలోచన వచ్చిందని.. క్రియేటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాంకర్గా నేను చేసిన తొలి కార్యక్రమం ‘మాయాద్వీపం’ అంటూ చెప్పాడు. దీని తర్వాత తాను వెనక్కి తిరిగి చూసుకోలేదన్నాడు.
ఇక మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు కదా.. మీరెప్పుడైనా ఫీల్ అయ్యారన్న అన్న ప్రశ్నకు అతడు ఇలా సమాధానం ఇచ్చాడు. లేదు..తాను ఇంకా అదృష్టంగా భావిస్తా. సాధారణంగా హీరోలను, రాజకీయ నాయకులను మాత్రమే ఇమిటేట్ చేస్తారు. నన్నుకూడా ఇమిటేట్ చేస్తున్నారంటే అది నా గొప్పే కదా అన్నాడు. దానిని నేను సరదాగా తీసుకుంటాను తప్ప కోపం తెచ్చుకొని ఈ సందర్భంగా ఓంకార్ తెలియజేశారు.
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…