తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్ విజయవంతంగా నడుస్తోంది. ఇప్పటికే దీనిలో 10 వారాలు పూర్తి చేసుకోగా.. 11వ వారంలోకి అడుగు పెట్టింది. అధికారికంగా బయటకు తెలియకపోయినా.. అనధికారికంగా 10 వ వారంలో జెస్సీ బయటకు వెళ్లినట్లు తెలిసింది.
ఇక బీబీ హోటల్ అంటూ బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్లో విజేతగా నిలిచిన రవి ఇంటి కెప్టెన్ అయ్యారు. ఇక కెప్టెన్ అవ్వడానికి ఇచ్చిన టాస్క్ లో షణ్ముఖ్, సన్నీ మధ్య భయంకరమైన గొడవ చోటు చేసుకుంది.. నవ్వెంతా అంటే నువ్వెంతా అన్నట్లు సాగింది ఈ గొడవ. బిగ్ బాస్ కు మొన్నటి వరకు టీఆర్పీ రేటు తగ్గగా.. ఇప్పుడిప్పుడే మళ్ళీ బిగ్ బాస్ రేటింగ్స్ పుంజుకుంటున్నట్టు కనిపిస్తుంది. సోషల్ మీడియాలోనూ బిగ్ బాస్ అప్డేట్స్ పై నెటిజన్స్ ఆసక్తి ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఇదిలా ఉంటే.. హౌస్ లో సన్నీ, షణ్ముఖ్ మధ్య జరుగుతున్న గొడవ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. దీనిపై షణ్ముఖ్ గర్లఫ్రెండ్ దీప్తి సునయనా తనదైన శైలిలో స్పందిస్తూ..ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పోస్టు చేశారు. ఆమె షేర్ చేసిన దానిని శివజ్యోతి షేర్ చేస్తూ.. ఆడవాళ్లని అడ్డం పెట్టుకుని ఆడటం అంటే..? ఒకసారి మీరు కెప్టెన్ అవడానికి యానీ మాస్టర్ సపోర్ట్ చేశారు. ఇది లేడీ కార్డ్ వాడటం కాదా..? గుర్తు తెచ్చుకోండి. హౌస్ బయట కాదు, హౌస్ లోపల హెల్తీ గేమ్ ఆడండి, మీరు మీ ఫ్రెండ్స్తో గేమ్ ఆడొచ్చు, మీ ఫ్రెండ్ మిమ్మల్ని సేవ్ చేయకపోతే అడగొచ్చు, ఏంటో మరి..’ అని సన్నీకి చురకలు అంటించింది శివ జ్యోతి. దీనిపై నెటిజన్లు తీవ్రంగా విరుచుపడుతున్నారు.
సన్నీ ఫ్యాన్స్ అయితే ఓ రేంజిలో విరుచుకుపడుతున్నారు. జ్యోతక్క.. షణ్ముఖ్, సిరి గురించి మాట్లాడటంలో తప్పలేదు .. సిరి సన్నీ క్యారెక్టర్ ను బ్యాడ్ చేయడంలో తప్పులేదు.. కాకపోతే.. మీరు కేవలం కొన్ని పాయింట్లు పట్టుకొని వేలాడకండి.. ప్రతీ పాయింట్ గురించి మాట్లాడాలి అంటూ చురకలంటించారు. క్యారెక్టర్ జడ్జ్ చేయొద్దు అంటూ వీడియోలు పెట్టావ్.. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి..? అంటూ సన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు బిగ్ బాస్ కు వెళ్లినప్పుడు అస్సలు గేమ్ ఆడారా.. ఊరికే ఏడవడం తప్పా ఏం చేతకాలేదు.. అలాంటిది మీరు గేమ్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ.. ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…