General News

పశువులను మేపడానికి వెళ్లిన వివాహిత.. గుర్తుతెలియని దుండగులు దారుణంగా..!

ఇంటి నుంచి మహిళ బయటకు అడుగుపెట్టిందంటే చాలు.. ఇంటికి తిరిగి వచ్చే దాకా నమ్మకం లేకుండా పోతోంది. ఎటునుంచి ఎవరు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతారో అనే భయం రోజురోజుకూ పెరిగిపోతోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావస్తున్నా.. ఇలాంటి అత్యాచారాలు, హత్యలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఇలాంటి ఘటనలు మన దేశంలో ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలోని తుమకూరు నగర సమీపంలోని బెట్టద బుడద వద్ద చోటు చేసుకుంది. పశువులను మేపడానికి వెళ్లిన ఓ వివాహితను కొందరు దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా.. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకొని వెళ్లిపోయారు. దీనికి సంబంధించి వివరాలను పోలీసులు తెలిపారు.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన 35 ఏళ్ల జయలక్ష్మికి చోటాసాబ్ పాళ్యకు చెందిన శివకుమార్ కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె పశువులను మేపడానికి రోజూ తమకు దగ్గర్లో ఉండే.. కొండ ప్రాంతానికి వెళ్తూ ఉండేది. ఇలానే ఓ రోజు ఉదయం పశువులను మేపడానికి వెళ్లిన ఆమె సాయంత్రం అయినా తిరిగి రాలేదు. కంగారు పడిన భర్త ఆమెను వెతుకుంటూ కొండపైకి చేరుకున్నాడు.

అక్కడ తన భార్యను విగతజీవిగా పడి ఉండటం చూసి అతడు గుండె బరువెక్కింది. ఆమె వంటిపై దుస్తులు చెదిరిపోవడం, మెడలోని మాంగల్యం, చైన్, ఇతర బంగారు ఆభరణాలు కూడా లేకపోవడం అతడు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…

6 minutes ago

ఫోన్‌తో టాయిలెట్‌లో గడిపితే… మీ శరీరం చెల్లించాల్సిన ధర ఇదే!

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…

8 minutes ago

టాలీవుడ్‌కు ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ హాట్ టాపిక్

తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…

12 minutes ago

కేరళ సీఎంకు లేఖ.. మోనాలిసా కేసులో కొత్త ట్విస్ట్

‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…

15 minutes ago

పచ్చదనం మంచిదే కానీ.. ఈ చెట్లకు దూరంగా ఉండండి!

ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…

38 minutes ago

భారత ఆధ్యాత్మికతను మార్చిన ఇద్దరు మహానుభావులు! అద్వైతం, విశిష్టాద్వైతం.. అసలు తేడా ఏమిటి?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…

1 hour ago