ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో లాక్ డౌన్ విధించి ఇంటికి పరిమితం కావాలంటే.. అమ్మో మరి లాక్ డౌన్ ఆ అంటూ హడలిపోతున్నారు . కానీ ఓ మహిళ మాత్రం ఏకంగా ఆరు సంవత్సరాల నుంచి లాక్ డౌన్ పాటిస్తోంది. అదేంటి ఆరు సంవత్సరాల క్రితమే ఆమెకు కరోనా వస్తుందని తెలుసా? అనే అనుమానం మీకు రావచ్చు. అయితే కరోనా వస్తుందని కాదండోయ్.. ఆమెకు అతి భయంకరమైన ‘ఎమెటోఫోబియా’ ఉంది. అంటే.. వాంతుల భయం.
సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా వాంతి చేసుకుంటున్నట్లు తెలిసినా, చూసిన మనకి కూడా వాంతి కలగడం జరుగుతుంది. కానీ 35 ఏళ్ల ఎమ్మా డావిస్కు మాత్రం ఇది తీవ్రస్థాయిలో ఉంది. ఆ ఫొబియానే గత ఆరు సంవత్సరాల నుంచి ఆమెను ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా చేస్తోంది.
ఈమెకు ఇద్దరు పిల్లలు ఉండగా గత ఆరు సంవత్సరాల నుంచి ఒక్క సారి కూడా తన పిల్లలతో కలిసి బయటకు వెళ్లింది లేదు.తన ఇద్దరు పిల్లలను తన భర్త వెంట తీసుకొని బయటకు వెళ్లే వారు.12 ఏళ్ల నుంచి ఎమ్మాలో ఈ ఫొబియా ఎక్కువగా ఉండడంతో నిత్యం వాంతులు చేసుకుంటూ కుప్పకూలిపోయోది. ఈ సందర్భంగా ఎమ్మా మాట్లాడుతూ “తాను ఉద్యోగం చేస్తున్నప్పుడు బస్సులో ప్రయాణించిన ఎక్కడికి వెళ్ళిన ఎంతో భయాందోళనకు గురు అయ్యేదని, రోజులో ఆరు సార్లు వాంతులు చేసుకుని కుప్పకూలి పోయేదాన్ని, అందుకే బయటకు వెళ్లాలంటే భయం వేయడంతో ఆరు సంవత్సరాల నుంచి ఇంటికే పరిమితం అయ్యాయని తెలిపారు.
అయితే ఈమెకు ఉన్న ఈ పరిస్థితులలో అధిక డిప్రెషన్ కి గురయ్యానని పేర్కొంది. ఈ ఫోబియా నుంచి బయటకు రావడం కోసం ఆమె నిత్యం వివిధ రకాల థెరపీలు, సైకోథెరపీలు ప్రయత్నించినా ఆ ఫోబియా నుంచి బయటపడలేక పోవడంతో ఆరు సంవత్సరాల నుంచి ఇంటికి పరిమితమైనట్లు తెలిపారు.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…