Women are angry at Ashok Gajapathi Raju for trying to take back the land given in 1999!
విజయనగరం: త్వరలో గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్న అశోక్ గజపతిరాజుపై విజయనగరంలో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1999లో తాను రైతు బజార్కు ఇచ్చిన స్థలాన్ని తిరిగి తనకు అప్పగించాలని ఆయన ఆదేశాలు జారీ చేయడంతో సుమారు 50 కుటుంబాల జీవనం అగమ్యగోచరంగా మారింది.
ఏమిటీ వివాదం?
1999లో అశోక్ గజపతిరాజు అనుమతితో, ఎమార్వో ఆఫీస్ సమీపంలో ఒక ఎకరం 48 సెంట్ల విస్తీర్ణంలో రైతు బజార్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ స్థలంలో సుమారు 50 కుటుంబాలు రైతు బజార్ను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం భూముల రేట్లు భారీగా పెరగడంతో, తాను ఇచ్చిన స్థలాన్ని సాయంత్రానికల్లా ఖాళీ చేయాలని సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కలెక్టర్కు ఆదేశాలు..
ఈ స్థలాన్ని ఖాళీ చేయించి తనకు అప్పగించాలని కోరుతూ అశోక్ గజపతిరాజు జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు ఆదేశాలు జారీ చేశారు. అశోక్ గజపతిరాజు నిర్ణయంతో తమ జీవనాధారం కోల్పోతామని ఆందోళన చెందుతున్న రైతు బజార్లోని మహిళలు, వ్యాపారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం విజయనగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…