World Cup T20 finals : మొదటి నుండి పేలవమైన పెర్ఫార్మన్స్ తో సెమీస్ ఆశలను వదులుకున్న పాకిస్థాన్ అనూహ్యంగా సెమీస్ చేరింది. ఇక పడుతూ లేస్తూ వచ్చినా కూడా దాదాపు సెమీస్ ఆశలు లేవు, కానీ అనూహ్యంగా ఇంగ్లాండ్ కూడా సెమిస్ లోకి అడుగుపెట్టింది. సరిగ్గా ఇలానే ముప్పై ఏళ్ళ క్రితం జరిగింది. 1992లో వరల్డ్ కప్ ప్రత్యర్థులు కూడా ఇంగ్లాండ్, పాకిస్థాన్. అప్పుడు కూడా ఇలాంటి సీన్ రిపీట్ అవ్వడం విశేషం ఇదంతా చూస్తుంటే అదే ఫలితం మళ్ళీ రిపీట్ అవ్వబోతోందా అన్న అనుమానం క్రికెట్ అభిమానులకు కలుగుతోంది.
మళ్ళీ అదే జరగనుందా…
ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతున్న వరల్డ్ కప్ 2022 లో ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. అసలు సెమీస్ కి రాదనుకున్న పాకిస్థాన్ ఫైనల్ లో ఉంది మొదటి నుండి బాగా ఆడిన కివిస్ దారుణంగ్స్ ఓడిపోయి ఇంటికి పోయింది. ఇక పడుతూ లేస్తూ ఇంగ్లాండ్ కూడా ఫైనల్స్ చేరి వీళ్ళిద్దరూ ఇప్పుడు 13 న జరిగే ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నారు. 1992 లో జరిగిన బెన్సన్ హెడ్జెస్ వరల్డ్ కప్ లో ఇదే జరిగింది. అప్పటి క్రికెట్ వేదికలు న్యూజిలాండ్, ఇంగ్లాండ్. పాకిస్థాన్ వెస్టిండీస్ తోనూ ఇండియా తోనూ మ్యాచ్లు ఓడిపోయి ఇక ఇంటికి పోతుంది అనే టైములో అనూహ్యంగా మూడు మ్యాచ్ లు గెలిచి సెమీస్ కి వెళ్ళింది. ఇక సెమీస్ లో న్యూజిలాండ్ ను మట్టికరిపించి ఫైనల్స్ కి చేరింది. ఫైనల్ లో ప్రత్యర్థి ఇంగ్లాండ్.
ఇక ఇపుడు వరల్డ్ కప్ లో కూడా గ్రూప్ మ్యాచ్ల్లో ఇండియా, జింబాబ్వే లతో వరుసగా ఓడిపోయింది. ఆ తరువాత వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి సెమీస్ కు చేరింది. ఇక సెమీస్ లో పాకిస్థాన్ కి అదృష్టం నెథెర్లండ్స్ రూపంలో దొరికింది, నేధర్లండ్స్ కి సౌత్ ఆఫ్రికా కి జరిగిన మ్యాచ్ లో అనూహ్యంగా నేదర్లండ్స్ గెలిచి పాకిస్థాన్ కి ఫైనల్ చేరే అవకాశం ఇచ్చింది. ఇక ఫైనల్ లో ఇంగ్లాండ్ తో పాకిస్థాన్ తలపడనుంది. ఇక 92 మ్యాచ్ లో ఇంగ్లాండ్-పాకిస్థాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ మొదట్లోనే కీలకమైన రెండు వికెట్స్ కోల్పోవడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ దే అనుకున్నారు. అయితే అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్, ఇంజిమమ్, జావీద్ మియాందాద్ విలువైన పరుగులు తీసి 50 ఓవర్లలో 249 పరుగులు తీసింది. ఇక ఇంగ్లాండ్ 49.2 ఓవర్లలో 227పరుగుల పరిమితమై 22 పరుగుల తేడాతో ఓడిపోయి పాకిస్తాన్ కు తొలి వరల్డ్ కప్ ను అందించింది. మరోసారి అదే సీన్ రిపీట్ అవుతుందో లేక మారుతోందో చూడాలి మరి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…