Featured

Senior Heroine Krishnaveni : ఆ హీరోయిన్ ఆస్తులను తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని మీకు తెలుసా?

Senior Heroine Krishnaveni : ‘మనదేశం’ సినిమా సీనియర్ ఎన్టీఆర్ మొదట తెలుగు తెరకు పరిచయమైన సినిమా. ఆ సినిమాలో చిన్న వేషంలో ఎన్టీఆర్ కనిపించారు. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన నటి సి.కృష్ణవేణి. నిర్మాతగా కృష్ణవేణి గారు నిర్మించిన మన దేశం సినిమా ద్వారా ఎన్టీఆర్ ను ఘంటసాల గారిని, ప్లే బ్యాక్ సింగర్ పి. లీలా గారిని పరిచయం చేసారు. ఆమె నాటక రంగం ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టారు. కీలు గుర్రం, బాల మిత్రుల కథ వంటి సినిమాల్లో పాటలను కూడా కృష్ణ వేణి గారు పాడారు.

ఆస్తులను స్వాదినం చేసుకున్న తమిళనాడు ప్రభుత్వం…

సతీ అనసూయ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టిన కృష్ణవేణి గారు ఆ సినిమాలో నటించిన సమయానికి ఆమె వయసు కేవలం 12 సంవత్సరాలు. పుల్లయ్య డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా కు ఆమెను రేలంగి వెంకటరామయ్య గారు కృష్ణవేణి గారిని పరిచయం చేసారు. ఇక మీర్జాపురం రాజు వారి జయ ఫిలిమ్స్ నిర్మించిన ‘భోజ కాళిదాసు’ సినిమాలో కృష్ణవేణి సెకండ్ హీరోయిన్ కాగా మొదటి హీరోయిన్ కన్నాంబ గారు. చాలా వరకు జయ ఫిలిమ్స్ లో నటించిన కృష్ణవేణి గారు రాజుగారిని పెళ్లి చేసుకన్నారు.

పెళ్ళయ్యాక సినిమాలకు దూరమైన కృష్ణవేణి గారు కేవలం సొంత బ్యానర్ లో మాత్రమే నటించారు. 1974 లో రాజావారు మరణించారు అయినా ఆర్థికంగా ఇబ్బందులు పడలేదు కృష్ణవేణి గారు. అయితే అప్పటి తమిళనాడు ప్రభుత్వం రాజావారికి సంబంధించిన కొన్ని ఆస్తులను జప్తు చేసుకున్నారు. నేటి విజయవాడ గన్నవరం విమానాశ్రయం ఉన్న స్థలం రాజావారు దానం చేసినదే అందుకే ఆయన పేరునే పెట్టారు. ఇప్పటికీ తమిళనాడు ప్రభుత్వం ఆస్తులను స్వాధీనం చేసుకున్నందుకు కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి.

Bhargavi

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

12 hours ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

12 hours ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

12 hours ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

13 hours ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

15 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

16 hours ago