Writer Vijayendra Prasad : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రాణా, అనుష్క, రమ్యకృష్ణ నటించిన సినిమా బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి రికార్డులను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ సినిమా రికార్డ్ గురించి మాట్లాడాలంటే బాహుబలి ముందు బాహుబలి తరువాత అనే మాట్లాడుతాం. అంతలా చరిత్ర సృష్టించిన బాహుబలి సినిమా కథను సృష్టించింది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు. ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాహుబలి సినిమా గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కట్టప్ప పాత్రకి మొదట అనుకున్నది…
సినిమాలో కథ అనుకున్నపుడే పాత్రలకు ఎవరు సరిపోతారని కొంతమందిని అనుకున్నాం అంటూ ప్రసాద్ తెలిపారు. మొదట శివగామి పాత్రకు రమ్య కృష్ణ ని తీసుకోవాలని ప్రసాద్ గారు సూచించారట. అయితే శ్రీదేవిని తీసుకోవాలని రాజమౌళి అనుకున్నారట. ఇక ఒకసారి మేకప్ టెస్టు చేసి రమ్యకృష్ణని చూడండి అని చెప్పారట.
ఇక యువరాణి పాత్రకు తమన్నా అనుకున్నపుడు నేను ఆమె సరిపోదని అనుకున్నాను. కానీ షూటింగ్ అపుడు ప్రాక్టీస్ సమయంలో చూసాక నేను పొరపాటు పడ్డానని అర్థమైంది అంటూ చెప్పారు. ఇక కట్టప్ప పాత్రకు మొదటి నుండి సత్యరాజ్ అలాగే మోహన్ లాల్ ఇద్దరిలో ఒకరిని అనుకున్నాం. మోహన్ లాల్ అయితే డేట్స్ అన్నీ ప్రాబ్లమ్ అవుతాయని సత్యారాజ్ అనుకున్నాం అంటూ ప్రసాద్ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…