Political News

జగన్ పై 2 లక్షల మెజారిటీతో గెలుస్తానంటున్న వైసీపీ ఎంపీ..?

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసి రెండు లక్షల మెజారిటీతో గెలుస్తానని ఆయన అన్నారు. గత కొంత కాలం నుంచి జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న రఘురామ కృష్ణంరాజును పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించినట్టు సోషల్, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

వైరల్ అవుతున్న వార్తల గురించి రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ లోక్ సభ స్పీకర్ కు వైసీపీ ఎంపీలు మూడు నెలల క్రితమే పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని లేఖ ఇచ్చారని.. అయితే అది ఏడాది పదవి కావడంతో తొలగించడం సాధ్యం కాదని ఆయన చెప్పారని తెలిపారు. తన ఏడాది పదవీకాలం పూర్తైందని.. అందువల్ల ఎంపీ బాలశౌరికి పదవి దక్కిందని రఘురామ చెప్పుకొచ్చారు.

త్వరలో తనపై అనర్హత వేటు వేస్తామని కొందరు నేతలు చెబుతున్నారని.. అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని తాను ఎన్నికలకు వెళితే జగన్ పైనే 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలుస్తానని తెలిపారు. తనను ఎవరూ పదవి నుంచి తొలగించలేరని.. జగన్ కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసిరారు. తాను జగన్ పై గెలుస్తానంటూ చేసిన వ్యాఖ్యలు అతిశయోక్తితో చెప్పినవి కాదని పేర్కొన్నారు.

బాలశౌరి సీఎం జగన్ మతానికి చెందిన వారు కాబట్టే ఆయనకు పదవి దక్కిందని.. ఆ పదవిని జగన్ బాలశౌరికి ముష్టి వేశారని చెప్పుకొచ్చారు. ఈ విషయాలేవీ సరిగ్గా తెలియని వైసీపీ సోషల్ మీడియా మాత్రం సంబరాలు చేసుకుంటోందని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago