Political News

ప్రతి మహిళ ఖాతాలో కేంద్రం రూ.2 లక్షల 20 వేలు జమ.. నిజమేనా..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి విదితమే. కేంద్రం కొన్ని నెలల క్రితం జన్ ధన్ ఖాతా ఉన్న మహిళల ఖాతాలలో నగదు జమ చేయడంతో పాటు గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చును మహిళల ఖాతాలో జమ చేసింది. మహిళలు సొంతంగా ఎదగాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్ లను అమలు చేస్తూ మోదీ సర్కార్ మహిళలకు ప్రయోజనం చేకూరుస్తోంది.

అయితే గత కొన్ని రోజుల నుంచి కేంద్రం దేశంలోని ప్రతి మహిళకు 2,20,000 రూపాయలకు జమ చేస్తోందని సోషల్, వెబ్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉపాధి దొరకకపోవడం, ఆదాయం తగ్గడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ప్రధానమంత్రి నారీశక్తి యోజన స్కీం కింద 2,20,000 రూపాయలు జమ చేస్తున్నట్టు సోషల్, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరి కేంద్రం నిజంగానే మహిళల ఖాతాల్లో నగదు జమ చేస్తోందా..? అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. కేంద్రం నుంచి అధికారికంగా ఈ స్కీమ్ ద్వారా 2,20,000 రూపాయలు నగదు జమ చేస్తున్నట్టు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వార్త గురించి స్పందించి వివరణ ఇచ్చింది. వైరల్ అవుతున్న వార్తలో వాస్తవం లేదని తెలిపింది.

కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాల్లో అసలు ఇలాంటి పథకమే లేకపోవడం గమనార్హం. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు వ్యూస్ పెంచుకోవాలనే దురుద్దేశంతో ఇలాంటి ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. విశ్లేషకులు ఇలాంటి వార్తలను ఇతరులకు షేర్ చేసేముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago