Political News

ప్రతి మహిళ ఖాతాలో కేంద్రం రూ.2 లక్షల 20 వేలు జమ.. నిజమేనా..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి విదితమే. కేంద్రం కొన్ని నెలల క్రితం జన్ ధన్ ఖాతా ఉన్న మహిళల ఖాతాలలో నగదు జమ చేయడంతో పాటు గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చును మహిళల ఖాతాలో జమ చేసింది. మహిళలు సొంతంగా ఎదగాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్ లను అమలు చేస్తూ మోదీ సర్కార్ మహిళలకు ప్రయోజనం చేకూరుస్తోంది.

అయితే గత కొన్ని రోజుల నుంచి కేంద్రం దేశంలోని ప్రతి మహిళకు 2,20,000 రూపాయలకు జమ చేస్తోందని సోషల్, వెబ్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉపాధి దొరకకపోవడం, ఆదాయం తగ్గడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ప్రధానమంత్రి నారీశక్తి యోజన స్కీం కింద 2,20,000 రూపాయలు జమ చేస్తున్నట్టు సోషల్, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరి కేంద్రం నిజంగానే మహిళల ఖాతాల్లో నగదు జమ చేస్తోందా..? అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. కేంద్రం నుంచి అధికారికంగా ఈ స్కీమ్ ద్వారా 2,20,000 రూపాయలు నగదు జమ చేస్తున్నట్టు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వార్త గురించి స్పందించి వివరణ ఇచ్చింది. వైరల్ అవుతున్న వార్తలో వాస్తవం లేదని తెలిపింది.

కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాల్లో అసలు ఇలాంటి పథకమే లేకపోవడం గమనార్హం. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు వ్యూస్ పెంచుకోవాలనే దురుద్దేశంతో ఇలాంటి ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. విశ్లేషకులు ఇలాంటి వార్తలను ఇతరులకు షేర్ చేసేముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago