గుడ్డు పేలింది అనే మాట వింటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.ఇంగ్లాండ్లోని బోల్టాన్లో నివసిస్తున్న చాంటెల్లే కాన్వే అనే మహిళ కోడుగుడ్డు పేలడంతో ముఖం, మెడ కాలిపోయాయి. దీంతో సదరు మహిళ గాయాలతో ఆసుపత్రి పాలై ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది. అసలు గుడ్డు ఎలా పేలిందనే విషయానికి వస్తే…
సదరు మహిళ టిక్ టాక్ వీడియోలను చూసి కోడిగుడ్లను మైక్రోఓవెన్ లో ఉడక పెడుతుంది. మైక్రోఓవెన్ లో గుడ్లు ఎంతో సులభంగా, తొందరగా ఉడుకుతాయనే ఉద్దేశంతో ఈ మహిళ గత కొంత కాలం నుంచి ఇదే పద్ధతి అనుసరిస్తోంది. అయితే తాజాగా ఆమెకు కోడిగుడ్లను ఉడకబెట్టడం ద్వారా అనుకోని సంఘటన, చేదు అనుభవం ఎదురయింది.
ఎప్పటిలాగే కోడిగుడ్లను మైక్రోఓవెన్ లో ఒక గాజు పాత్రలో నీటిని పోసి ఉడక పెట్టింది పది నిమిషాల తర్వాత కోడి గుడ్లు ఉన్న గిన్నెను బయటకు తీసి కోడిగుడ్లను బయటకు తీయడం కోసం ఒక చల్లని స్పూన్ గిన్నెలో పెట్టగానే కోడిగుడ్డు బాంబు మాదిరిగా పేలింది.దీంతో గిన్నెలో ఉన్నటువంటి వేడి నీళ్ళు ఒక్కసారిగా ముఖానికి, మెడకు ఎగరడంతో ఆమె మొహం పై తీవ్రమైన గాయాలు ఏర్ప డ్డాయి.
వేడినీళ్లు ఎగిరే సమయంలో మహిళ కళ్ళు మూసుకోవడం వల్ల కంటికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇంటిలో కేవలం తన 18 నెలల చిన్నారి మాత్రమే ఉండటంతో ఆమె ఆసుపత్రికి చేరి చికిత్స తీసుకోవడానికి గంట సమయం పట్టింది. ఈ క్రమంలోనే కోలుకున్న మహిళ ఇకపై ఎవరూ కూడా కోడిగుడ్లను మైక్రోఓవెన్ లో పెట్టి ఉడికించవద్దని తెలిపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…