గుడ్డు పేలింది అనే మాట వింటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.ఇంగ్లాండ్లోని బోల్టాన్లో నివసిస్తున్న చాంటెల్లే కాన్వే అనే మహిళ కోడుగుడ్డు పేలడంతో ముఖం, మెడ కాలిపోయాయి. దీంతో సదరు మహిళ గాయాలతో ఆసుపత్రి పాలై ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది. అసలు గుడ్డు ఎలా పేలిందనే విషయానికి వస్తే…
సదరు మహిళ టిక్ టాక్ వీడియోలను చూసి కోడిగుడ్లను మైక్రోఓవెన్ లో ఉడక పెడుతుంది. మైక్రోఓవెన్ లో గుడ్లు ఎంతో సులభంగా, తొందరగా ఉడుకుతాయనే ఉద్దేశంతో ఈ మహిళ గత కొంత కాలం నుంచి ఇదే పద్ధతి అనుసరిస్తోంది. అయితే తాజాగా ఆమెకు కోడిగుడ్లను ఉడకబెట్టడం ద్వారా అనుకోని సంఘటన, చేదు అనుభవం ఎదురయింది.
ఎప్పటిలాగే కోడిగుడ్లను మైక్రోఓవెన్ లో ఒక గాజు పాత్రలో నీటిని పోసి ఉడక పెట్టింది పది నిమిషాల తర్వాత కోడి గుడ్లు ఉన్న గిన్నెను బయటకు తీసి కోడిగుడ్లను బయటకు తీయడం కోసం ఒక చల్లని స్పూన్ గిన్నెలో పెట్టగానే కోడిగుడ్డు బాంబు మాదిరిగా పేలింది.దీంతో గిన్నెలో ఉన్నటువంటి వేడి నీళ్ళు ఒక్కసారిగా ముఖానికి, మెడకు ఎగరడంతో ఆమె మొహం పై తీవ్రమైన గాయాలు ఏర్ప డ్డాయి.
వేడినీళ్లు ఎగిరే సమయంలో మహిళ కళ్ళు మూసుకోవడం వల్ల కంటికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇంటిలో కేవలం తన 18 నెలల చిన్నారి మాత్రమే ఉండటంతో ఆమె ఆసుపత్రికి చేరి చికిత్స తీసుకోవడానికి గంట సమయం పట్టింది. ఈ క్రమంలోనే కోలుకున్న మహిళ ఇకపై ఎవరూ కూడా కోడిగుడ్లను మైక్రోఓవెన్ లో పెట్టి ఉడికించవద్దని తెలిపింది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…