గుడ్డు పేలింది అనే మాట వింటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.ఇంగ్లాండ్లోని బోల్టాన్లో నివసిస్తున్న చాంటెల్లే కాన్వే అనే మహిళ కోడుగుడ్డు పేలడంతో ముఖం, మెడ కాలిపోయాయి. దీంతో సదరు మహిళ గాయాలతో ఆసుపత్రి పాలై ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది. అసలు గుడ్డు ఎలా పేలిందనే విషయానికి వస్తే…
సదరు మహిళ టిక్ టాక్ వీడియోలను చూసి కోడిగుడ్లను మైక్రోఓవెన్ లో ఉడక పెడుతుంది. మైక్రోఓవెన్ లో గుడ్లు ఎంతో సులభంగా, తొందరగా ఉడుకుతాయనే ఉద్దేశంతో ఈ మహిళ గత కొంత కాలం నుంచి ఇదే పద్ధతి అనుసరిస్తోంది. అయితే తాజాగా ఆమెకు కోడిగుడ్లను ఉడకబెట్టడం ద్వారా అనుకోని సంఘటన, చేదు అనుభవం ఎదురయింది.
ఎప్పటిలాగే కోడిగుడ్లను మైక్రోఓవెన్ లో ఒక గాజు పాత్రలో నీటిని పోసి ఉడక పెట్టింది పది నిమిషాల తర్వాత కోడి గుడ్లు ఉన్న గిన్నెను బయటకు తీసి కోడిగుడ్లను బయటకు తీయడం కోసం ఒక చల్లని స్పూన్ గిన్నెలో పెట్టగానే కోడిగుడ్డు బాంబు మాదిరిగా పేలింది.దీంతో గిన్నెలో ఉన్నటువంటి వేడి నీళ్ళు ఒక్కసారిగా ముఖానికి, మెడకు ఎగరడంతో ఆమె మొహం పై తీవ్రమైన గాయాలు ఏర్ప డ్డాయి.
వేడినీళ్లు ఎగిరే సమయంలో మహిళ కళ్ళు మూసుకోవడం వల్ల కంటికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇంటిలో కేవలం తన 18 నెలల చిన్నారి మాత్రమే ఉండటంతో ఆమె ఆసుపత్రికి చేరి చికిత్స తీసుకోవడానికి గంట సమయం పట్టింది. ఈ క్రమంలోనే కోలుకున్న మహిళ ఇకపై ఎవరూ కూడా కోడిగుడ్లను మైక్రోఓవెన్ లో పెట్టి ఉడికించవద్దని తెలిపింది.
సోషల్ మీడియా శక్తి మరోసారి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు దేశవ్యాప్తంగా వచ్చిన సహకారం,…
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…