Call Recordings: మీ కాల్ రికార్డింగ్స్ వాళ్ల చేతిలోకి..! ఇకపై ఆపరేటర్స్ కు కొత్త రూల్స్..!
Call Recordings:. టెలీ కమ్యూనికేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరి కాకుండా రెండేళ్ల పాటు కాల్ రికార్డింగుల డేటాను భద్రపరచాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది కేంద్రం. గతంలో ఇది ఒకే ఏడాది మాత్రమే ఉంది. టెలికాం సంస్థలతో పాటు కమర్షియల్, ఇతరత్రా కాల్స్ వివరాల రికార్డులను మెయింటెన్ చేయాలని.. ఇందుకోసం ఏకీకృత లైసెన్స్ ఒప్పందంలో సవరణలు
చేసింది.
భద్రత పరంగా వచ్చిన అభ్యర్థనల మేరకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డిసెంబర్ 21న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. కాల్ రికార్డ్ వివరాలతో పాటు, ఎక్స్ ఛేంజ్ వివరాలను, ఐపీ వివరాలను రెండేళ్ల పాటు భద్రపరచాలని ఆదేశించింది. సాధారణ కాల్స్ తో పాటు ఇంటర్నెట్ కాల్స్ డేటాను రికార్డ్ చేయాలని నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇది కేవలం విధానపరమైన నిర్ణయం అని .. రెండేళ్ల పాటు రికార్డులు ఉంటే.. భద్రతా పరమైన విషయాలకు కీలకంగా మారుతాయని.. రెండేళ్ల డాటా తమకు అవసరమని.. భద్రతా సంస్థలు తెలపడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో ప్రభుత్వ కాల్ రికార్డులను 12 నెలల వరకు ఉంచాలని కోరితే.. మేం 18 నెలల వరకు ఉంచామని.. ఇప్పుడు ఆ నియమాలను మార్చారని.. చట్టబద్దమైన సంస్థలు కోరితే డేటాను మరింత కాలం ఉంచుతామని.. మిగిలినవన్నింటినీ కేవలం 45 రోజుల్లో తొలగిస్తామని టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మీడియాకు తెలిపారు. కాల్ డేటాను టెక్స్ రూపంలో టెలికాం సర్వీస్ కంపెనీలు చెబుతున్నాయి. ఎవరికి కాల్ చేశారు. ఏంఏం మాట్లాడరనేది ఇందులో టెక్స్ రూపంలో భద్రపరుస్తామని తెలిపారు. అయితే దీని వల్ల వినియోగదారుడికి నష్టం ఉండదని టెలికాం ఆపరేటర్లు అంటున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…