కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎక్కువ వేతనం పొందే ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కేంద్రం కొత్త వేతన చట్టాన్ని అమలులోకి తీసుకురాగా ఈ వేతన చట్టానికి ప్రైవేట్ కంపెనీలు సైతం ఆమోదం ప్రకటించాయి. ఫలితంగా ఇకపై బేసిక్ పే కంటే అలవెన్సులు ఎక్కువగా ఉంటే ఉద్యోగులకు వేతనంలో కోత విధిస్తారు. ఏప్రిల్ నుంచి కొత్త వేతన చట్టం అమలులోకి రానుండగా అలవెన్సులు ఎక్కువగా ఉండే ఉద్యోగులు కొత్త వేతన చట్టం వల్ల తీవ్రంగా నష్టపోనున్నారు.
అలవెన్సులు ఎక్కువగా ఉండే ఉద్యోగులకు దాదాపు 12 శాతం వరకు వేతనంలో కోత విధించే అవకాశాలు ఉంటాయి. కొత్త వేతన చట్టం ప్రకారం వేతనంలో 50 శాతం బేసిక్ పే ఖచ్చితంగా ఉండాలి. అదే సమయంలో ఇతర ఆలవెన్సులు మాత్రం ఖచ్చితంగా 50 శాతం కంటే తక్కువగానే ఉండాలి. కొత్త వేతన చట్టానికి అంగీకారం తెలిపిన కంపెనీలు వేతనంలో 50 శాతం బేసిక్ పే ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
కేంద్రం కొత్త వేతన చట్టం అమలులోకి తీసుకురావడం వల్ల ఉద్యోగులకు గతంతో పోలిస్తే గ్రాట్యుటీ భారీగా పెరగనుంది. అదే సమయంలో ప్రస్తుతం చెల్లిస్తున్న మొత్తంతో పోలిస్తే పీఎఫ్ కోసం ఉద్యోగం చెల్లించే మొత్తం కూడా పెరగనుంది. మారిన నియమనిబంధనల వల్ల ఉద్యోగులకు ప్రస్తుతం ఇంటికి తీసుకెళ్లే మొత్తంతో పోలిస్తే వేతనం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఉద్యోగి ఇప్పుడు నష్టపోయినా పదవీ విరమణ తర్వాత ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది.
ఈ చట్టం వల్ల జీతాల చెల్లింపు విషయంలో కీలక మార్పులు రానుండగా ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పోలిస్తే ప్రైవేట్ రంగ ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రభావం తీవ్రంగా పడనుంది. ఆర్థిక నిపుణులు కొత్త వేతన చట్టం వల్ల ఉద్యోగులు తాత్కాలికంగా నష్టపోయినా భవిష్యత్తులో భారీ లాభాలు పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…