ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎక్కువగా ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా స్టార్ గా కూడా మారుతున్నారు యూజర్లు. ఇక ఒకప్పుడు బ్యాన్ చేసిన టిక్ టాక్ యాప్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ప్రతి ఒక్కరు తమ డాన్స్ వీడియోలతో స్టార్స్ గా మారారు. ఇదిలా ఉంటే ఓ మై గాడ్ ఓ మై గాడ్ అనిపించే టిక్ టాక్ లో స్టార్ గా మారిన ఫన్ బకెట్ భార్గవ్ గురించి అందరికీ తెలిసిందే. తన వీడియోలతో తెగ ఫేమస్ గా మారిన ఈయనపై.. రేప్ కేసు నమోదయింది. అంతేకాకుండా అరెస్టు చేశారని మరో యూట్యూబ్ యాంకర్ శివ తెగ పోస్టులను చేస్తున్నారు.
ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎటువంటి క్లారిటీ లేకపోగా.. బహుశా ఇది ఫ్రాంక్ వీడియో గా చేస్తున్నారేమోనని అనుమానం రాగా మొత్తానికి ఈ విషయం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. యాంకర్ శివ ఫ్రాంక్ వీడియోలు చేస్తూ తెగ పాపులర్ సంపాదించుకున్నాడు. ఇక ఇది కూడా అలాగే అనుకోగా.. శివ చేసిన పోస్టులు మాత్రం కాస్త ఆసక్తిగా అనిపించాయి.
తాజాగా యాంకర్ శివ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో..’ నాకు ఒకటి అర్థం కాదు.. ఈరోజు దిశ చట్టం అంటే ఎవరికీ తెలియలేదు చూశారా? గొప్పోల్రా బాబు.. ఉండాల్సిన వాళ్లే.. మీరా నాకు కామెంట్స్ పెట్టారు. నిజాలు చెప్తుంటే ఫ్రాంక్ అంటారు. ఏంట్రా నాయనా.. వాళ్లతో నేను ఎందుకు ఫ్రాంక్ చేస్తా.. మీరు మారరు. పోలీసుల నుంచి నాకు ఫోన్ వచ్చింది. పోస్ట్ డిలీట్ చేయమని. ఎందుకంటే వాళ్ల ఫేసులు కనిపించకూడదట. రేపు వాళ్ళ అఫీషియల్ గా చేస్తామని నాతో చెప్పారు’ అని పోస్ట్ చేశాడు.
ఇక ఈ పోస్ట్ చూడగా ఎవరికీ ఏమీ అర్థం కాక, యాంకర్ శివ తో ఫన్ బకెట్ భార్గవ్ కు ఏమైనా గొడవలు ఉన్నాయా లేదా ఏవైనా ట్రిక్స్ ప్లే చేస్తున్నాడా అని కామెంట్లు వస్తున్నాయి. అంతేకాకుండా ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా ఓ వీడియో కూడా వైరల్ గా మారగా.. అందులో ఉన్న వ్యక్తి ఫన్ బకెట్ భార్గవ్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో, పోస్టులు తెగ వైరల్ గా మారాయి.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…