YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రజలలోకి రావడానికి సిద్ధమయ్యారు. ఈయన అధికారం కోల్పోవడమే కాకుండా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లు దాడులను ఇదివరకు ఖండిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు నేరుగా జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 50 రోజులపాటు పర్యటన చేయాలనే నిర్ణయం తీసుకున్నారు అందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా పూర్తి అయిందని తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆరు నెలలు పూర్తి అయిన తర్వాత కూటమి పాలన గురించి ఈయన గ్రౌండ్ లెవెల్ లో ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రజలతో మమేకం అవ్వడమే కాకుండా పార్టీ కార్యకర్తలను నాయకులను కూడా ఈయన కలవనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 25 ఎంపీ స్థానాల్లో ఉన్నాయి అయితే ఈయన ఎంపి స్థానాల పరిధిలో పర్యటించబోతున్నారని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు రోజులపాటు పర్యటన చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన నేతలు అలాగే కార్యకర్తలతో కూడా జగన్ మాట్లాడబోతున్నారని సమాచారం.
ఇక గ్రౌండ్ లెవెల్లో కూటమి ప్రభుత్వ పాలన ఎలాగుంది ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలుపరిచారు అనే విషయాల గురించి కూడా ఈయన ఆరా తీయబోతున్నారని సమాచారం. అయితే ఈ పర్యటన మాత్రం వచ్చే యేడాది సంక్రాంతి పండుగ తర్వాత నుంచి ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఇంకా ఇప్పటివరకు ఈ పర్యటన గురించి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడ లేదు కానీ ఈయన పర్యటనకు మాత్రం అన్ని సిద్ధమయ్యాయి అని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…