Akhil Akkineni: అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి భాజలు మోగుతున్న సంగతి మనకు తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీ నాగచైతన్య శోభితల వివాహం జరగబోతున్న నేపథ్యంలో అక్కినేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా నాగార్జున ఇటీవల ఈ శుభవార్తను అధికారకంగా తెలియజేశారు. అయితే తాజాగా మరో గుడ్ న్యూస్ కూడా ఈయన వెల్లడించారు.
నాగార్జున మరో కుమారుడు అఖిల్ అక్కినేని సైతం నిశ్చితార్థం జరుపుకున్నట్లు నాగార్జున సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజాగా నిఖిల్ తనకు కాబోయే భార్యకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అఖిల్ తో నిశ్చితార్థం జరుపుకున్న అమ్మాయి పేరు జైనాబ్ రవ్జీ. ఇలా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగిందనే విషయాన్ని తెలుపడంతో అమ్మాయి ఎవరు అంటూ అభిమానులు పెద్ద ఎత్తున తనకోసం సర్చ్ మొదలుపెట్టారు. అయితే జైనాబ్ ఇండియాతో పాటు దుబాయ్ లండన్ వంటి విదేశాలలో పెరిగినట్టు తెలుస్తుంది. ఇక ఈమె తండ్రి పేరు జుల్ఫీ రవ్జీ . ఈయన బిజినెస్మెన్ గా మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇకపోతే ఈయన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుడిగా పని చేయడమే కాకుండా మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలు అందించారు. అలాగే జగన్, నాగార్జునల ఫ్యామిలీలతో కూడా దగ్గరి సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈయన కుమారుడు జైన్ రవ్జీ కూడా వ్యాపారవేత్తేగా స్థిరపడ్డారు. జైనాబ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోందట. ఇక ఈమె గత ఆరు సంవత్సరాలుగా అసలు ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెళ్లి ఎప్పుడు అనే ఆరా తీయడం మొదలుపెట్టారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…