YS Jagan: వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.రాజ్యాంగానికి ఆమోదముద్ర పడ్డ సరిగ్గా 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మన రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుంది. అలాంటి ప్రాముఖ్యత కల్గిన రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే మూల స్తంభం.
ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్నది. వీటి పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో మనం కూడా ఎందుకు బ్యాలెట్ వైపు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని తెలిపారు.
ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాదు.. ఉన్నట్టుగా కూడా కనబడాలి. అందరి ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్ర్యం కొంతకాలంగా అణచివేయబడుతోంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సహా రాజ్యాంగాన్ని రూపొందించిన మన దార్శనిక నాయకులు సమానత్వం వైపు నడిపించారని వైఎస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.. ఇలా ఈయన ఈవీఎంల పనితీరు గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ సంచలనంగా మారడమే కాకుండా ఈ పోస్టుపై విభిన్న రకాలుగా స్పందిస్తూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…