ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు లేని పేదవారికి మరో శుభవార్త చెప్పారు. కొత్తగా ఇంటి స్థలం కొరకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి అర్హుడని తేలితే 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టాను అందించాలని సూచించారు. రాష్ట్రంలో 26,21,049 ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందని సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 30,06,673 ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోందని సీఎం తెలిపారు. ఎవరైనా ఇంటి పట్టా కొరకు దరఖాస్తు చేసుకుంటే వారిని దరఖాస్తు అందిన 12 రోజుల్లో భౌతికంగా వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వెరిఫికేషన్ చేయాలని జగన్ పేర్కొన్నారు.
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 90.28 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ ఇప్పటికే పూర్తైందని జగన్ తెలిపారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంపై సమీక్ష నిర్వహించిన జగన్ సమీక్షలో భాగంగా ఈ విషయాలను వెల్లడించారు. ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ నిరంతర కార్యక్రమం అని సీఎం జగన్ పేర్కొన్నారు. అధికారులు ఇళ్ల స్థలం పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జగన్ సూచించారు.
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందాలనే ఉద్దేశంతో జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. స్థలం ఉండి ఇల్లు లేని వారికి కూడా ప్రయోజనం చేకూర్చే దిశగా జగన్ సర్కార్ ముందడుగులు వేయనుంది. సీఎం జగన్ లబ్దిదారులను సోషల్ అడిట్ ద్వారా గుర్తించాలని.. నిర్మాణాల్లో నాణత, ఏకరూపత కోసం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచనలు చేశారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు.
డంపింగ్ యార్డుల్లో బయో మైనింగ్ చేయాలని.. త్వరగా ఈ ప్రక్రియను మొదలుపెట్టాలని పేర్కొన్నారు. అధికారులు మార్చి నెల 31 నాటికి జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి డీపీఆర్ ను సిద్ధం చేస్తామని సీఎం జగన్ కు వెల్లడించారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…