AP politics: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కేవలం రెండు వారాలు సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పార్టీ అధినేతల సైతం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంతో ప్రజలందరిలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది.
ఎన్నికల మేనిఫెస్టో చూసిన తర్వాత ఓటు ఎవరికి వేయాలి అనే విషయంపై ప్రజలందరూ కూడా ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్లస్ అంటూ గత ఎన్నికలకు ముందు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోని విడుదల చేసి ఆ పథకాలకు కొంత మొత్తంలో డబ్బులు అధికంగా అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కూటమి సైతం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి ఈ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేనిఫెస్టోలో ఎన్నో రకాల పథకాలు అలాగే సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా పరుగులు పెట్టించే దిశగా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇలా ఎన్నికల మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఎంతోమంది ద్వితీయశ్రేణి వైసిపి కార్యకర్తలు నాయకులు టిడిపిలోకి చేరికలు మొదలుపెట్టారు.
కూటమి గెలుపు ఖాయం..
మేనిఫెస్టో విడుదల తర్వాత వచ్చేది కచ్చితంగా కూటమియే అని గ్రహించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున వైసీపీ నుంచి టిడిపిలోకి వలస వెళ్తున్నారు. ఈ విధంగా కూటమి ప్రకటించిన మేనిఫెస్టో కనుక చూస్తే కచ్చితంగా వైసీపీకి ఓటమి తప్పదని కూటమి గెలుపు ఎవరు ఆపలేరని చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…