Connect with us

Featured

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

Published

on

టీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కెసిఆర్ తనయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ పట్టాభిషేకానికి లైన్ క్లియర్ అయిపొయింది. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం నేపథ్యంలో ఈ దిశగా కెసిఆర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సీఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఎలా ఉండబోతోంది అని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను కలిపే బాధ్యతతో మరోసారి కీలక భూమిక దిశగా అడుగులు వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయంపైనా ప్రత్యేకంగా కేటీఆర్ పేరు ప్రస్తావించి ఆశీస్సులు అందజేశారు.

అదేసమయంలో మంత్రులు కొంతకాలంగా కేటీఆర్ ను ఉద్దేశించి చేస్తున్న ప్రకటనలపైన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖలతో స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోంది. సమయం, సందర్భం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నట్టు తేలిపోయింది. ఇదే సమయంలో మున్సిపల్ ఫలితాల తరువాత అటు పార్టీలో, ఇటు ప్రగతి భవనంలో కేటీఆర్ పేరు మారు మ్రోగిపోతోంది. కేసీఆర్ తిరిగి జాతీయ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తనయుడు కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 31 జిల్లా పరిషత్తులు గెలుచుకోవడంతో, మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయంతో కేటీఆర్ సమర్ధత ఏంటో పార్టీ నేతలకు, ప్రజలకు తెలియజేయటంలో కేసీఆర్ విజయం సాధించారు. ఇక కొంత కాలంగా మంత్రులు పోటీపడి మరీ కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో జాతీయ రాజకీయాలు, కాంగ్రెస్, బీజేపీయేతర నేతలను ఏకం చేయడంకోసం ఇతర పార్టీల ముఖ్యమంత్రుల సమావేశానికి కేసీఆర్ లీడ్ తీసుకున్నారట. దీని ద్వారా తెలంగాణలో ప్రభుత్వ, పార్టీ భాద్యతలను తనయుడు కేటీఆర్ కు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చారన్నది అయన మాటల్లోనే వ్యక్తమైనట్టు భావించాల్సి ఉంది. కొంతకాలంగా కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం గురించి పార్టీలో పెద్దఎత్తున చర్చ సాగుతుంది. ఆ సమయంలో కెసిఆర్ జాతీయ రాజకీయాల పైన ఫోకస్ చేస్తూనే పార్టీ అధ్యక్షుడిగా, ప్రభుత్వాన్ని సలహాలిచ్చే చట్టబద్ధ సంఘానికి చైర్మన్ గా ఉంటారంటూ పార్టీలోని సీనియర్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖానించారు.

Advertisement

తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత క్యాబినెట్ మంత్రుల ప్రకటనలో విష్ ఫుల్ థింకింగ్ గా వాళ్ళు, వీళ్ళు అంటున్నారని కాదని సమయం సందర్భం చూసుకుని నిర్ణయం ఉంటుందని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ, కలిసి వచ్చే పార్టీల సీఎంలతో కలిసి పోరాడతానని, దేశంకోసం జాతీయ రాజకీయాలలోకి వెళ్తానని ప్రకటించారు. దీని ద్వారా కేటీఆర్ కు పట్టాభిషేకం ఖాయమని కేసీఆర్ వ్యాఖల సారాంశం అంటూ పార్టీ నేతలు అంచనాకి వస్తున్నారు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు వెనక కేటీఆర్ ప్రస్తావన స్వయంగా కేసీఆర్ తీసుకురావడంతో పాటుగా ప్రత్యేకంగా ఆశీస్సులు అందజేశారు. 2024 లో ఫెడరల్ ఫ్రెంట్ దే అధికారం అనే ధీమాలో కేసీఆర్ ఉన్నారు. దీనితో కుమారుడికి పీఠం అప్పగింత నిర్ణయం తీసుకోడానికి ఆయనకు ఎక్కువ సమయం పట్టదని అభిప్రాయ పడుతున్నారు.

అయితే నెలరోజుల్లో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం అవుతానని వెల్లడించడంతో అతి స్వల్ప వ్యవధిలోనే కేటీఆర్ సీఎంగా కొలువుదీరవచ్చని అంటున్నారు. తాజాపరిణామాలతో కేటీఆర్ కు తెలంగాణ భవన్ లో అభినందనలు వెల్లువెత్తాయి. దీనితో కేటీఆర్ కు పగ్గాలు అప్పగించేందుకు దాదాపు నిర్ణయం అయినట్టేనని, సమయానుకూలంగా ముహూర్తం మాత్రమే ఖరారు చేయాల్సి ఉందని పార్టీనేతలు అంచనా వేస్తున్నారు. ఇక ఫిబ్రవరిలో కేసీఆర్ కుటుంబం ఒక యాగం తలపెట్టింది. ఆ తరువాత కేటీఆర్ కు పట్టాభిషేకం ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!