Connect with us

General News

పుట్టిన నెలను బట్టి ఏ అమ్మాయి మనస్తత్వం ఎలా ఉంటుందో చూడండి..

Published

on

ఆడవారి మాటలకూ అర్ధాలు వేరులే అంటుంటాం. వారు ఎప్పుడు ప్రస్నార్ధకమ. ఓ పట్టాన అర్ధం కారు. ఎంత అర్ధం చేసుకోవాలని ప్రయత్నించినా అర్ధం కావడం లేదు అంటుంటారు. అయితే, ఆడవారిని అర్ధం చేసుకోవడానికి సహనం కావాలి. పురాణ కాలంలో శ్రీకృష్ణుడు, మహావిష్ణువు వంటి వారే ఆడవారిని అర్ధం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది. ఇక మానవమత్రులమైన మనం ఎంత. వారు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు. అలాంటి సమయంలో మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి. ఇకపోతే, ఆడవారు పుట్టిన నెలను బట్టి వారి మనస్తత్వం ఉంటుందట. మరి ఏ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దాం.


1. జనవరి: ఈ నెలలో పుట్టిన వారు చాలా నిజాయితీగా ఉంటారట. వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది. వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు మాట్లాడుకుంటుంటే కోపగించుకుంటారు. అలాంటి వారిని ఎక్కువగా ద్వేషిస్తారు. వీరి స్వతంత్రంగా ఉండేందుకే ఆసక్తి చూపుతారు. నాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువ.

2. ఫిబ్రవరి: వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. అలాగే వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులపై వీరికి ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. అయితే, వీరు అంత తేలికగా ఎవరికీ అర్ధం కారు. ఎందుకంటే వీరి మూడ్ ఒక్కోసారి ఒక్కోరకంగా ఉంటుంది. ఇలాంటి ఆడవారిని ఎవరైనా మోసం చేశారంటే లైఫ్ లో వారిని మళ్లీ నమ్మరు.

Advertisement

3. మార్చి: ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. నిజాయితీగా, విశ్వాసంగా ఉంటారు. వీరు ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు. వీరిని ప్రేమలో దింపాలంటే మాత్రం చాలా కష్టం. ఒక్కసారి వీరు మీ ప్రేమలో పడ్డారనుకో మీరు అదృష్టవంతులే. ఎందుకంటే జీవితాంతం మీతోనే ఉండాలని పిక్స్ అయిపోతారు. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్న మీ నుంచి దూరంకారు. మీకు అండగా ఉంటారు.


4. ఏప్రిల్: ఏప్రిల్ నెలలో పుట్టిన అమ్మాయిలు మంచి తెలివైన వారు. ఎలాంటి పనినైనా వీరు ఈజీగా డీల్ చేయగలరు. ప్రతి ఒక్కరి మనస్సును సులభంగా దోచుకుంటారు. ఇక వీరు ప్రేమించిన వ్యక్తులు వీరిని కాకుండా ఇతరుల్ని ప్రేమిస్తే వీరు తట్టుకోలేరు. వీరికి అసూయ ఎక్కువ. వీరు చాలా డైనమిక్ గా, యాక్టివ్‌గా ఎట్రాక్టివ్ గా ఉంటారు.

5. మే: మే నెలలో పుట్టిన అమ్మాయిలు అందంగా ఉంటారు. వీరితో ప్రేమలో పడ్డారంటే ఇంకా అంతేసంగతులు. మీరు కచ్చితంగా డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లే. వీళ్లు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోలేదు. వీరిలో హార్డ్ వర్క్ చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు కాస్త నిజాయితీగా ఉంటారు.

6. జూన్: జూన్ లో పుట్టిన అమ్మాయిల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మంచి కమ్యూనికేషన్స్ కలిగి ఉంటారు. ఏం మాట్లాడినా దానికి ముందు బాగా అలోచించి మాట్లాడుతారు. ఏ విషయాన్ని అయినా ముఖం మీదే చెప్పేస్తారు. మనుషుల వెనక మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. అంతేకాదండోయ్ వీరు కాస్త ప్రమాదకరమైన వ్యక్తులు కూడా.

SAMSUNG CSC


7. జూలై : ఈ నెలలో పుట్టిన మహిళలు చాలా నిజాయితీగా ఉంటారు. అంతేకాదు చాలా అందంగా ఉంటారు. మంచి తెలివి గల వారు. వీరు విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటారు. జాలి గుణం ఎక్కువ. రిలేషన్స్ ను కాపాడుకుంటారు. వీళ్లు ఒక్కసారి హర్ట్ అయ్యారంటే అంతేసంగతి. మళ్లీ వీళ్లు మామాలు మనుషులు కావడానికి చాలా టైమ్ పడుతుంది.

8. ఆగస్టు: ఆగస్ట్ లో పుట్టినవారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. మంచి మనస్సు, మనస్తత్వం కలిగి ఉంటారు. సెన్సార్ హ్యుమర్ కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక అందరి దృష్టి ఎప్పుడూ వీరిపైనే ఉండాలని భావిస్తారు. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా రొమాంటిక్ గా ఉంటారు.
9. సెప్టెంబర్: సెప్టెంబర్ లో పుట్టిన అమ్మాయిలకు జాలి, దయ ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణ కూడా ఎక్కువే. అందానికి ప్రతిరూపంగా ఉంటారు. మోసగించిన వారిని వీరు అస్సలు క్షమించరు. ప్రతీకారం తీర్చుకునే వరకు వదలరు. వీరిని ఎప్పటికి కూడా ఇబ్బంది కలిగించకూడదు. వీరి కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్ పెక్టేషన్స్ కలిగి ఉంటారు. నిజాయితీగా, సెన్సిటివ్ గా ఉంటారు. మనసులో ఉన్న ఫీలింగ్స్ ను బయటకు చెప్పరు. అందుకే వీరిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం.

Advertisement


10. అక్టోబర్ : అక్టోబర్ లో జన్మించిన మహిళలకు చిన్నచిన్న విషయాలకు భయపడే మనసత్వం ఉండదు. వీరికి భావోద్వేగాలు ఎక్కువ. వీరు చాలా స్మార్ట్ గా ఉంటారు. అయితే వీరి ఫీలింగ్స్ ను అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు. వీరు ఇతర మహిళలకు అంతగా నచ్చరు. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలంటే మిగతా వారికి అసూయ ఎక్కువ. వీరుకొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కోల్పోతారు.

11. నవంబర్: వీరు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు. వీరి దగ్గర ఏదైనా అబద్దం చెబతే వెంటనే వీరు గుర్తుపడతారు. అందువల్ల వీరితో ఎప్పుడు కూడా అబద్దం చెప్పకూడదు. వీరు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉంటారు. వీళ్లు చాలా తెలివైనవాళ్లు, చాలా షార్ప్‌గా ఆలోచిస్తారు.

12. డిసెంబరు: వీరేప్పుడు అసహనానికి గురవుతుంటారు. వీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే బలాన్ని కలగి ఉంటారు. ఏదైనా సమస్య వచ్చి మూడ్ బగాలేకున్నా వెంటనే తిరిగి మాములు స్థితికి ఎలా రావాలో వీరికి బాగా తెలుసు. వీళ్లు ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. చాలా తేలికగా లక్, వెల్త్ పొందుతారు.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Viral News: పీత డెక్క పై నరసింహ స్వామి రూపం.. వైరల్ అవుతున్న ఫోటో?

Published

on

Viral News: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో వింతలు విశేషాలు ప్రతి ఒక్కరికి క్షణాలలో తెలిసిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక అరుదైన పీత ఫోటో వైరల్ అవుతుంది. ఈ పీత డెక్క పై సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

కోనసీమ జిల్లా, సకినేటి పల్లిలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది. ఈ గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తికి గోదావరి ఒడ్డున ఈత కనిపించడంతో దానిని తీసుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఆపీతను కృష్ణ కుమార్తె నీళ్లలో వేయగా ఆ సమయంలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది.

నరసింహస్వామి రూపం..
ఈ విధంగా పీత డెక్కపై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆపీతను చూడటానికి వచ్చారు అయితే ఆ పీత డెక్క పై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే కృష్ణ దానిని తిరిగి గోదావరి నదిలో వదిలివేశారు. ప్రస్తుతం ఈ పీతకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Continue Reading

General News

ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Published

on

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ లలో సెటప్ బాక్స్ బిజినెస్ కూడా ఒకటి ఏపీలో సుమారు 65 లక్షల కుటుంబాలు ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయాల కారణంగా జూన్ 6వ తేదీ నుంచి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం ఆగిపోయాయి.

జూన్ ఆరవ తేదీ నుంచి సాక్షి టీవీతో పాటు ఎన్ టీవీ, టీవీ9 వంటికి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఇలా న్యూస్ ఛానల్ లో ప్రసారం నిలిపివేయడంతో ఇది చట్టపరంగా విరుద్ధమని తిరిగి ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది.న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్లో చట్ట విరుద్ధంగా కొన్ని న్యూస్ ఛానల్ లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయటాన్ని న్యాయస్థానం పూర్తిగా ఖండించింది. కేవలం రాజకీయ న్యాయకత్వం పరంగా మార్పులు రావడంతోనే కేబుల్ ఆపరేటర్ల పై ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని చెప్పారు.

Advertisement

ఇలా సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ న్యూస్ ఛానల్ ప్రసారం నిలిపివేయటం చట్టపరంగా విరుద్ధమని, ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయటం అనేది ప్రేక్షకుల సమాచార హక్కుని నిరాకరించే ప్రయత్నం జరగటం దురదృష్టకరమైన తెలిపారు. ఈ క్రమంలోనే నిలిపివేసిన ఈ చానల్లను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.

Advertisement
Continue Reading

Featured

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!

Published

on

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తెల్లవారుజామున 4:50 నిమిషాలకు కన్నుమూశారు.

శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈయనని హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే ఈయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

ఒక రామోజీరావు మరణ వార్త తెలియడంతో సినీ పరిశ్రమ అటు మీడియా రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మీడియా రంగానికి ఎన్నో సేవలు చేసిన రామోజీరావు మరణ వార్త తెలిసి ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన మరణ వార్త తెలియడంతో తెలుగుదేశం అధినేతలు మరణం వార్తపై సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

అనారోగ్యంతో కన్నుమూత..

రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈయన రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా పత్రిక రంగానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఈయన ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని తన నివాసానికి తరలించారు కూడా స్పందిస్తున్నారు.

Advertisement

Continue Reading
Advertisement

Trending

Don`t copy text!