సినీ క్రిటిక్ మరియూ నటుడు కత్తి మహేష్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.. కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. కొద్ది గంటలు గడిస్తే కాని అయన ఆరోగ్యంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేమని అంటున్నారు వైద్యులు. ఈ నేపధ్యంలో కత్తి మహేష్కి ఇలా రోడ్డు ప్రమాదం జరగడంపై ఆయనని ద్వేషించే కొందరు కౌంటర్స్ వేస్తున్నారు.
తాజాగా సినీ నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. రాముడిని, సీతని.. నీ అవసరానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకున్నావ్, వదిలేశావ్. ఏళ్ల నుంచి పద్దతిగా తన పని తాను చేసుకునే బ్రహ్మణ అమ్మాయిని.. నువ్ ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నాను.. ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావ్ అని. ఇప్పటికైనా అమ్మాయిలను, అమ్మని గౌరవించడం నేర్చుకో జై శ్రీరామ్ అని పూనమ్ కౌర్ ట్వీట్ వేశారు. అయితే ఇందులో అతని పేరు ఎక్కడా ప్రస్తావించకుండా పరోక్షంగా అతనిపై సెటైర్ వేసింది.
ప్రస్తుతం పూనమ్ కౌర్ ట్వీట్ పై సినీ వర్గాలలో చర్చ మొదలైంది. అయితే గతంలో కత్తి మహేష్.. పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ లకు సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేసిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో పూనమ్ కౌర్ ఆయనపై ఘాటుగానే స్పందించింది.. అయితే ఆటను అంత ప్రాణాపాయమైన పరిస్థితిలో ఉంటే పూనం కౌర్ ఇటువంటి ట్వీట్ చేయడంపై మండిపడుతున్నారు నెటిజన్లు..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…