నేడు వాసాలమర్రికి సీఎం కేసీఆర్‌

వరుస జిల్లా పర్యటనలతో సీఎం కేసీఆర్ బీజిగా మారిపోయారు. జిల్లా కలక్టరెట్‌ల ప్రారంభోత్సవాల సందర్భంగా సిద్దిపేట,కామరెడ్డి,సిరిసిల్ల పర్యటనలు చేసిన కేసీఆర్ తాజాగా నాగర్జునసాగర్ హాలియాలో పర్యటించారు. నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని దత్తత గ్రామమైన వాసాలమర్రిలో పర్యటించనున్నారు. జూన్‌ 22న ఈ గ్రామాన్ని సందర్శించిన కేసీఆర్‌ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పలు అభివృద్ది పనుల కోసం అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఈ పర్యటనలో భాగంగా దళితవాడలో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన రైతువేదికలో 130 మందితో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని గ్రామసర్పంచి ఆంజనేయులుకు ఫోన్‌ చేసి కేసీఆర్ చెప్పారు. అలాగే గత పర్యటనలో తానిచ్చిన హామీల అమలు తీరును కూడా ఆయన పరిశీలించనున్నారు.