Featured

ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు.. ఆ ఒక్క జిల్లాలో మాత్రం ఒంటి గంట వరకే..

కరోనా ఉదృతి కాస్త తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో కర్ఫ్యూ నిబందనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. తాజగా సడలింపులు నేటి నుంచి అమలు కానున్నాయి. ఈ నేపధ్యంలో నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఒక్క తూర్పుగోదావరి జిల్లా మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఉద్యోగుల పనివేళలు మార్పు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు.

కరోనా నేపధ్యంలో కర్ఫ్యూ సడలింపులు తూర్పుగోదావరి జిల్లాకు ఇవ్వలేదు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పనివేళలుగా నిర్ణయించారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ప్రభుత్వ కార్యకలాపాలు సాధారణ సమయాలలానే కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగులకు పనివేళలుగా నిర్ణయించారు. అయితే జూన్ 30వ తేదీ వరకు ఈ పనివేళలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పల్లీలు తింటే ఈ స్థాయి లాభాలా? మాంసం కూడా ఫెయిల్ అవుతుంది!

చాలామంది పల్లీలను చిన్నపాటి స్నాక్‌గా మాత్రమే భావిస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం వేరుశెనగలను పూర్తి స్థాయి పోషకాహారంగా గుర్తిస్తున్నారు.…

32 minutes ago

పూజలో హారతి మధ్యలో ఆరిపోతే ఏమవుతుంది? ఆధ్యాత్మిక అర్థం ఏమిటి!

పూజా కార్యక్రమాల్లో హారతి అనేది ముఖ్యమైన భాగంగా భావిస్తారు. దేవుడికి నైవేద్యం సమర్పించిన తరువాత కర్పూరం లేదా దీపంతో హారతి…

40 minutes ago

పారిజాతం మొక్క ఇంట్లో ఉందా? ఐశ్వర్యానికి ఇది సంకేతమట!

ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం మన సంస్కృతిలో భాగం. అయితే కొన్ని ప్రత్యేక మొక్కలకు ఆధ్యాత్మికంగా, వాస్తు పరంగా కూడా…

54 minutes ago

ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2026: ఆస్తమా నియంత్రణకు మందులే కాదు.. ఆహారం కూడా కీలకం!

ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2026 సందర్భంగా శ్వాసకోశ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మే…

60 minutes ago

వేసవిలో బాడీ హీట్ తగ్గించే సూపర్ బ్రేక్‌ఫాస్ట్ ఇదే!

వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలపై దృష్టి పెట్టడం అవసరం అవుతోంది. ముఖ్యంగా ఉదయం తీసుకునే…

1 hour ago

మజ్జిగే బెస్ట్! వేసవిలో పెరుగు ఎలా తీసుకోవాలో పూర్తి గైడ్!

ఎండాకాలం వచ్చేసరికి శరీరానికి చల్లదనం కోసం చాలా మంది పెరుగు, మజ్జిగ, లస్సీ వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే…

1 hour ago