రాముడు భీముడు తో ప్రారంభమైన సురేష్ ప్రొడక్షన్స్ ఆ తర్వాత అద్భుతమైన చిత్రాలను తీయడం జరిగింది. 1971లో కె. ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ప్రేమనగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 1980 వచ్చేసరికి డి.రామానాయుడు తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఒక చల్లని రాత్రి, కక్ష, అగ్నిపూలు, ప్రేమ మందిరం లాంటి చిత్రాలను తీసి పీకల్లోతు నష్టాల్లో కూరుకు పోయారు. ప్రేమమందిరం సినిమా ప్రేమనగర్ సినిమాల అద్భుత విజయాన్ని సాధిస్తుందని భారీ అంచనాల నడుమ సినిమా విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన నిరాశను చవిచూసింది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గారి నాన్న గారైన సత్యమూర్తి ఆ రోజుల్లో ఆంధ్రప్రభ పత్రికలకు కథలు రాసేవాడు.
అందులో వచ్చిన ఒక కథను యువఆర్ట్స్ అధినేత మురారికి నచ్చడంతో సత్యమూర్తిని మద్రాస్ పిలిపించారు. అలా సత్యమూర్తి ని రాఘవేంద్ర రావు దగ్గరికి తీసుకెళ్లి ఒక కథ సత్యమూర్తిచే నిర్మాత మురారి చెప్పించారు. ఎందుకనో ఆ సినిమా రూపు దాల్చలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు డి.రామానాయుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ఒక సినిమా అనుకోగా కథ కోసం సత్య మూర్తిని రాఘవేంద్రరావు పిలిపించారు. ఆ కథ డి.రామానాయుడుకు నచ్చడంతో దేవత సినిమా ప్రారంభిద్దాం అనుకున్నారు. కానీ అంతకుముందే అడవి రాముడు, వేటగాడు, కొండవీటి సింహం లాంటి చిత్రాలు తీసిన రాఘవేంద్రరావుకు ఇలాంటి ఫ్యామిలీ చిత్రాన్ని తీయగలరా అని డి.రామానాయుడు అనుకున్నారు. కానీ చివరకు రాఘవేంద్రరావు కే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ చిత్రానికి సత్యానంద్ ను మాటల రచయితగా ఎంపిక చేసుకున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ లో హీరో శోభన్ బాబు కు దేవత ఏడవ సినిమా, శ్రీదేవికి ఈ చిత్రం మూడవ సినిమా, జయప్రదకు రెండవ సినిమా, రాఘవేంద్రరావుకు ఈ చిత్రమే మొదటి సినిమా. ఈ సినిమాలో పాటలు అత్యద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా వేటూరి రాసిన “వెళ్లువచ్చి గోదారమ్మ వెల్లాకిలా పడ్డాదమ్మో…” అనే పాట దేవత చిత్రం విడుదల అయిన తర్వాత ఆంధ్రదేశమంతటా ఒక ఊపు ఊపేసింది.
ఈ పాట చిత్రీకరణ రాజమండ్రి దగ్గర అగ్రహారంలో గోదావరి తీర ప్రాంతంలో షూటింగ్ జరిపారు. దేవత చిత్రయూనిట్ గోదావరి నదిపై బోటులో ప్రయాణించి ఆ తర్వాత కొంత దూరం బురదలో నడిస్తే లోకేషన్స్ స్పాట్ వచ్చేది. అలా బురదలో నడిస్తే శ్రీదేవి వేసుకున్న కాస్ట్యూమ్స్ పై బురద పడుతుందని నిర్మాత డి.రామానాయుడు శ్రీదేవిని లొకేషన్ స్పాట్ వరకి ఎత్తుకెళ్లేవారు. ఈ పాట కోసం బిందెలను రాజమండ్రి నుంచి తెప్పించారు. అలా ఈ సినిమా 1982లో విడుదలై అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…