తాజగా మెదక్లో మరో బారుబావి ఘటన చోటుచేసుకుంది. మృత్యు కుహరాల్లా నోళ్లు తెరిచిన బోరుబావులకు పసిపిల్లలు ఇంకా బలవుతూనే ఉన్నారు. ఇప్పటికే ఎంతోమంది పిల్లలు చనిపోతున్నా వ్యవస్థలో మార్పు రావడంలేదు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోద్చన్ పల్లిలో మూడేళ్ళ బాలుడు బోరు బావిలో పడ్డాడు. పొడ్చన్పల్లి గ్రామంలో సాయివర్ధన్ అనే మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు.
ఈరోజు సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటానా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. నీరు రావడం లేదని 120 అడుగులు తవ్విన యాజమాని దాన్ని కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా వదిలేసాడు. అప్పటినుంచి ఆ భావి అలానే ఉంది. తాడు సాయంతో పైకి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో బోరుబావికి సమాంతరంగా పొక్లైనర్లతో గొయ్యి తవ్వుతున్నారు. 120 అడుగుల లోతున్న ఈ బోరుబావిలో బాలుడు ప్రస్తుతం 20 అడుగుల లోతులో చిక్తకుకున్మనట్టు సమాచారం. ఘటనపై చిన్నారి తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…