భారత్ లోని అన్ని రంగాలలో మరీ ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఆటోమేషన్ వేగవంతం అవుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బోఫా) తాజా నివేదిక తెలిపింది. దీని వలన మనదేశంలోని సాఫ్ట్వేర్ రంగంలో 2022 నాటికి ఉద్యోగుల సంఖ్య 30 లక్షల వరకు తగ్గిపోయే ఆస్కారం ఉందని బోఫా నివేదిక వెల్లడించింది.

ఈ నేపధ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రతిఏటా 10,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.7.3 లక్షల కోట్లు) ఆదా చేయనున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇది మన ఇండియన్ కరెన్సీలో సుమారు 7.3 లక్షల కోట్లు. దీనితో ఐటీ కంపెనీల ప్రాతినిథ్య మండలి నాస్కామ్ ప్రకారం.. దేశీయ ఐటీ రంగంలో 1.6 కోట్ల మంది పని చేస్తున్నారు. అందులో 90 లక్షల మంది తక్కువ నైపుణ్యంతో కూడిన సేవలందిచే వారు, బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీఓ) విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నవారే.



























