73rd republic day celebrations photos goes viral on media

Republic Day : 73 వ గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన… వైరల్ గా మారిన ఫోటోలు !

Republic Day : భారతీయులు ఆగస్టు 15 ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అలానే జనవరి 26 కుడా అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఎంతో మంది భారత సమరయోధుల కృషి ఫలితమే జనవరి 26 అనగా గణతంత్ర వేడుక. ఈ వేడుకలలో వివిధ సంస్కృతులలో శకటాలు అద్భుతంగా ప్రదర్శించడం జరుగుతుంది. కాగా ఈ మేరకు 73వ భారత గణతంత్ర వేడుకలు కూడా ఘనంగా జరిగాయి.

73rd republic day celebrations photos goes viral on media
73rd republic day celebrations photos goes viral on media

దేశ రాజధాని అయినా ఢిల్లీలోని రాజ్ పథ్ లో గణతంత్ర దినోత్సవ పరేడ్ కన్నుల పండువగా సాగింది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పేలా పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. పలు రాష్ట్రాలు, కేంద్ర శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన భారత్ లో వైవిద్యానికి మన భారత సంస్కృతికి అద్దంపట్టేలా ఉన్నాయి.

73rd republic day celebrations photos goes viral on media

గణతంత్ర వేడుక సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ పోటీకి డుకలో 480 ఎంపిక చేయడం జరిగింది. ఈ పోటీలలో సాంస్కృతిక ప్రదర్శనలు చేశాయి. అయితే ఈ ప్రదర్శనలను కెమెరాల్లో షూట్ చేసిన పరేడ్ దృశ్యాలను రాజ్‌పథ్‌ మార్గంలో ఉంచి ఎల్ఈడీ తెరలపై ప్రదర్శించారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రిపబ్లిక్ డే వేడుకలను ప్రారంభించారు. దేశంలో విశిష్ఠ సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలను ప్రదానం చేశారు.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆ రాష్ట్ర శకటం…

అయితే ఈ ఏడాది జరిగిన 73వ గణతంత్ర వేడుకల్లో నిర్వహించిన పరేడ్‌లో పంజాబ్‌కు చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం.భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఈ శకటాన్ని రూపొందించారు. స్వాతంత్ర్యయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ప్రధానంగా పేర్కొంటూ పంజాబ్‌లో స్వాతంత్ర్య పోరాట కాలం నాటి సందర్భాలను వివరించే విధంగా ఈ శకటాన్ని రూపొందించారు ప్రస్తుతం ఈ ప్రదర్శన నెటిజన్లు ఆకట్టుకుంటుంది. అలాగే వీటితో పాటు పలు ప్రదర్శనలు కూడా ఆకట్టుకున్నాయి.