Online Game: ఆ వ్యసనంతో భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన బ్యాంకు ఉద్యోగి..!
Online Game: తాజాగా చెన్నైలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నెలకు దాదాపుగా రెండు లక్షల రూపాయలు సంపాదించే ఒక బ్యాంకు ఉద్యోగి భార్య పిల్లలను చంపి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మణికందన్ అనే వ్యక్తి పారూర్ లోని బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగపరంగా ఉన్నత స్థానంలో ఉండటంతో మణికందన్ కూడా మంచి జీతమే వస్తూ ఉండేది.
అతను సంవత్సరానికి దాదాపు 28 లక్షల జీతం తీసుకునే వాడు. ఇక సమీపంలోనే ఒక అపార్ట్మెంట్ లోని సెవెంత్ ఫ్లోర్ లో తన భార్య తారా, కొడుకు తరుణ్, మరొక కొడుకు దహన్ తో కలిసి నివసిస్తూ ఉండేవాడు.
ఈ మధ్యకాలంలో మణికందన్ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఆన్ లైన్ లో రమ్మీ ఆటకి బానిసగా మారాడు. ఈ క్రమంలోనే లక్షల జీవితం వస్తున్నా కూడా, ఆ ఆట కోసం లక్షలు పెట్టుబడి పెట్టి ఉన్న డబ్బులు అంతా పోగొట్టుకున్నాడు. చివరికి అప్పుల పాలయ్యాడు.
ఈ క్రమంలోనే ఒక రెండు నెలల క్రితం ఉద్యోగం కూడా కోల్పోయాడు. దీంతో ఇంట్లోనే ఉంటున్న మణికందన్ కు, అతని భార్య తారా కి మధ్య కి తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు భార్యతో గొడవలు, మరొకవైపు అప్పులు తీసుకున్న వాళ్లు నుంచి వేధింపుల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన మణికందన్, క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా డిసెంబర్ 31న ఎప్పటిలాగే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మణికందన్ కు అప్పు ఇచ్చిన అతని స్నేహితురాలు తరచూ ఫోన్ చేస్తుండటంతో.. ఏదో ఒక కారణం చెప్పాలి అని మణికందన్ తన భార్యతో ఫోన్ మాట్లాడించేవాడు. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా మణికందన్ మొదట తన భార్యా పిల్లలను చంపి అనంతరం అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక జనవరి 1న వీరు ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా నట్టింట్లో తారా, ఆమె పిల్లలు విగతజీవులుగా కనిపించారు. మణికందన్ కిచెన్ లో ఉరి వేసుకొని కనిపించాడు. మణికందన్ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఇలా చేశాడు అని పోలీసుల విచారణలో తేలింది. మొదట భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపి, తన పిల్లలను గొంతునులిమి హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్డ్ పేర్లలో ఒకరు.…
సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…
ఉత్తరప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…
తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్లో సుహాస్ ఇప్పుడు…
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన యష్ కొత్త చిత్రం టాక్సిక్ నుంచి తాజా టీజర్ విడుదలైంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న…