ఏదైనా మనకు అవసరం పడినప్పుడు సమయానికి మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాం.. ఏటీఎంలోకి వెళ్లి డ్రా చేసుకొని ఆ పని చూసుకుంటాం. ఒకవేళ ఏటీఎం సెంటర్ వద్ద జనాలు ఎక్కువగా ఉండి.. క్యూ ఎక్కువగా ఉంటే ఏం చేస్తాం.. ఎంత సేపైనా ఓపికతో ఉండి ఏటీఎం సెంటర్ లోకి వెళ్లి డబ్బులను తీసుకుంటాం.
ఇలా ఏటీఎం సెంటర్ లోకి వెళ్లి కార్డును స్వైప్ చేసి.. ఏటీఎం స్క్రీన్ల మీద కనిపించే ఆప్షన్లను క్లిక్ చేస్తూ ఉంటారు ప్రతీ కస్టమర్. అయితే భయట అంత సేపు వెయిట్ చేసిన అతడు.. లోపల ఒక్కోసారి డిస్ ప్లే అవ్వడానికి టైం తీసకుంటుంది. స్వైప్ చేసిన దగ్గర నుంచి డబ్బులు తన చేతిలో పడేంత వరకు ఎంత సమయం పడుతుందో తెలుసా.. అక్కడ కస్టమర్ ఎంత సమయం వరకు ఓపికతో ఉంటాడో తెలుసా.. ఈ విషయాలపై ఆర్బీఐ ఓ సర్వే నిర్వహించి వెల్లడించింది.
దీనిలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. వాటిని ఇక్కడ తెలుసుకుందాం.. ఏటీఎంలో కార్డ్ స్వైపింగ్ మొదలు డబ్బు బయటికి వచ్చేవరకు అంతా ఆటోమెటిక్గా సాగుతుంది. ఓక్కో సమయంలో కొద్దిగా సమయం ఎక్కువగా తీసుకోవచ్చు. కార్డ్ స్వైపింగ్ చేసిన ఏడు సెకన్ల లోపు ట్రాన్సాక్షన్ మొదలు కావాల్సిందే.
దానికి ఒక్క సెకన్ లేటయినా.. కస్టమర్ తిట్టడమో.. లేదా ఏటీఎంను తన్నడమో చేస్తుంటాడు. లేదా సీసీ కెమెరాల వంక చూసుకుంటూ నానా బూతులు తిడతారట. ఇది ఆర్బీఐ నిర్వహించిన సర్వేలో తేలిందట. ఏటీఎం, ఇతర నెట్వర్క్లలో ఏదైన సమస్య ఉంటే మాత్రం ఆలస్యం అవుతున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…