గూడ్స్ రైళ్లలో ఎక్కువగా రసాయన పదర్ధాలు లేదా మరేదైనా ఉపయోగపడే వస్తువులను సరఫరా చేస్తూ.. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఎగుమతి.. దిగుమతి చేస్తుంటారు. అయితే ఓ గూడ్స్ రైలు విజయవాడ నుంచి భద్రాచలం వైపు వెళ్తోంది. ఖమ్మం స్టేషన్ దాటి వెళ్తున్న క్రమంలో డోర్నకల్ వద్ద ఒక్కసారిగా పట్టాలు తప్పింది. దంతో ఆ రైలులోని భోగీలపై ఉన్న వ్యాగన్లు ఓ పక్కకు ఒరిగాయి.
ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వర్షం కురుస్తున్నప్పడటికీ ఆ వ్యాగన్లను పునరుద్దరించే చర్యలు చేపట్టారు. దీంతో రైళ్ల రాకపోకలు అంతరాయం కలిగింది.
మరో ఘటన… రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు మృతి.. ఇదిలా ఉండగా.. అమెరికాలోని మోంటానలో రైలు పట్టాలు అదుపు తప్పిన ఘటనలో ముగ్గురు చనిపోగా.. దాదాపు 50 మంది గాయపడ్డారని రైల్వే సంస్థ అమ్ట్రాక్ తెలిపింది. సంఘటన స్థలంలో సాయక చర్యలు మొదలయ్యాయని పేర్కొంది. ఇందులో సుమారు 141 మంది ప్రయాణీకులు, 16 మంది సిబ్బంది ఉన్నారు.
మోంటానలోని జోప్లిన్ వద్దకు రైలు రాగానే… పట్టాలు తప్పింది. మోంటాన స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు వెంటనే దర్యాప్తు చేపట్టింది. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. హిల్ కౌంటీ మొంటానాలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. కనీసం ఐదు హాస్పిటళ్లు వీరికి చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…