Fake Fertilizers: వేల రూపాయలు పోసి ఎరువుల బస్తాలు కొన్న రైతు… వాటి తెరిచి చూసి లబోదిబోమన్నాడు!
Fake Fertilizers: భారత దేశంలో వ్యవసాయం అంటేనే రుతుపవనాలతో జూదం. ఏ ఏడాది పంట చేతికి వస్తే మరో ఏడాది తీవ్ర వర్షాల వల్లనో, కరువు వల్లనో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అయినా ఏ నాడు వ్యవసాయాన్ని వదలడం లేదు రైతన్నలు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వ్యవసాయం చేస్తున్నారు. ఏటా ఎరువులకు, కౌలుకు, కూలీలకు రేట్లు పెరుగుతున్నాయి.
మొత్తంగా పెట్టుబడీ పెరుగుతున్నా.. అందుకు తగిన గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. కనీసం మద్దతు ధర కూడా రాని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు కల్తీ విత్తనాలు, ఎరువులతో రైతులను దోచుకుంటున్నారు. వ్యాపారుల మాటలు నమ్మి నట్టేటా మునిగిపోతున్నారు.
ముఖ్యంగా సీజన్ ప్రారంభం అయిందంటే నకిలీ విత్తనాలు.. ముఖ్యంగా పత్తి, మిర్చి విత్తానాలు నకిలీవి అమ్ముతున్నారు. పంట వేసిన కొంత కాలానికి కాపు, పూత రాక నష్టపోతున్నారు. పురుగుల మందు తాగుతూ.. ఉరి వేసుకుంటు రైతులు తనువు చాలిస్తున్నారు.
సరిగ్గా ఇలాంటి కల్తీ వ్యవహారమే రాజంపేట మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో తిరుగుతూ రైతులకు నకిలీ ఎరువులు అంటగట్టారు. తడమడ్ల గ్రామంలో రైతు స్వామికి ఇలాంటి నకిలీ ఎరువులను అంటగట్టారు. బస్తాకు రూ. 1000 నుంచి రూ. 2000 లకు ఎరువులను అంటగట్టి… ఎక్కువ దిగుబడి వస్తుందంటూ.. మాయమాటలు చెప్పారు. దోమకొండ మండలం కేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలోని గోదాంలతో స్టాక్ పెట్టి పలు గ్రామాల్లో విక్రయించారు. అయితే పంటలో వేస్తే ఎటువంటి మార్పు రాలేదని.. కేవలం మట్టి మాత్రమే బస్తాల్లో ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. తాము మోసపోయామని.. ఇప్పటికైనా అధికారులు కల్తీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…