సాధారణంగా మనం ఇంట్లో ఉండే స్పూన్ లను తినడానికి మాత్రమే ఉపయోగిస్తాం. అయితే ఆ స్పూన్ సహాయంతో ఎన్నో అనారోగ్య సమస్యలను సులభంగా గుర్తించవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఒక స్పూన్ టెస్ట్ క్షణాల్లో మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామో లేక అనారోగ్యంతో ఉన్నామో తెలిసేలా చేస్తుంది. అయితే స్పూన్ టెస్ట్ ద్వారా సరైన ఫలితాలు పొందాలంటే ఏమీ తినకుండా ఉదయం సమయంలో మాత్రమే ఈ టెస్ట్ చేసుకోవాలి.
మన శరీరం అనారోగ్యానికి సంబంధించి ఏదో ఒకలా సంకేతాలను ఇస్తూ ఉంటుంది. ఆ సంకేతాలను మనం సరైన సమయంలో గుర్తించలేకపోతే మాత్రం చిన్న ఆరోగ్య సమస్య పెద్ద ఆరోగ్య సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సెకన్ల సమయంలో సులభంగా చేసుకునే ఈ స్పూన్ టెస్ట్ చేసుకోవాలంటే మంచి నీళ్లు కూడా తాగకూడదు. ఉదయం నిద్రలేచిన తరువాత స్పూన్ తో నాలుకపై రుద్దితే స్పూన్ కు లాలాజలం అంటుకుంటుంది.
ఆ స్పూన్ ను ప్లాస్టిక్ కవర్ లో ఉంచి 60 సెకన్ల పాటు ఎండలో ఉంచాలి. ఆ తరువాత ఆ స్పూన్ ను పరిశీలిస్తే స్పూన్ లో ఎటువంటి మచ్చలు కనిపించకపోతే శరీరంలోని అవయవాలు అన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లే. అలా కాకుండా మచ్చలు కనిపిస్తే శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఆ తరువాత స్పూన్ పై ఉన్న లాలాజలం వాసనను పరిశీలించాలి.
ఆ వాసన భరించలేని విధంగా ఉంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ కు సూచనగా భావించాలి. ఆ స్పూన్ పై నారింజ రంగులో మచ్చలు ఉంటే కిడ్నీ వ్యాధి, పసుపు మచ్చలు అయితే థైరాయిడ్ సమస్యలు, ఊదా రంగు మచ్చలు ఉంటే సాధారణంగా ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువ మొత్తం కొవ్వు పరిమాణం ఉందని భావించాలి. తెల్ల మచ్చలు ఉంటే వైరస్, అంటు వ్యాధుల వల్ల ఆరోగ్య సమస్యలు, పండ్ల వాసన వస్తే డయాబెటిస్, అమ్మోనియా వాసన ఇస్తే కిడ్నీల్లో లోపానికి సంకేతంగా గుర్తించాలి. ఈ విధంగా స్పూన్ టెస్ట్ చేయడం ద్వారా మన ఆరోగ్య సమస్యలను మనం సులభంగా తెలుసుకోవచ్చు.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…