Aadipurush: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన జూన్ 16వ తేదీ ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.అయితే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ కన్నా ట్రైలర్ 100 రేట్లు మెరుగ్గా ఉందంటూ పలువురు ట్రైలర్ వీడియో పై స్పందిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు ప్రభాస్ ఫస్ట్ ఛాయిస్ కాదని సమాచారం. డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమా కోసం ముందుగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ను ఎంపిక చేసుకున్నారట ఇందులో హృతిక్ రాముడి పాత్రలో నటించగా ప్రభాస్ ను రావణాసురుడి పాత్రలో అనుకున్నారట.
హృతిక్ రోషన్ కి కథ మొత్తం వివరించగా ఈయన సినిమా కథలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని సూచించారట అయితే అది నచ్చినటువంటి డైరెక్టర్ ఈ సినిమాని హృతిక్ రోషన్ తో చేయడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. ఇలా హృతిక్ రోషన్ ను వద్దనుకున్న ఓమ్ రౌత్ ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ ని అలాగే రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో సీత పాత్రలో నటి కృతిసనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా విడుదలైన సమయంలో భారీగా ట్రోల్స్ రావడంతో ఈ సినిమాని పోస్ట్ ఫోన్ చేసి జూన్ 16వ తేదీ విడుదలకు సిద్ధం చేస్తున్నారు. మరి విడుదలకు ముందే ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నటువంటి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…