Actor Harinath: ఈ ఏడాది ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అలాగే వారి కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. ఇలా ఈ ఏడాది ఎంతోమంది సెలబ్రిటీలను ఇండస్ట్రీ కోల్పోయిందని చెప్పాలి. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు హరినాథ్ ఇంట్లో కూడా విషాద ఘటన చోటుచేసుకుంది.
సీనియర్ నటుడు హరినాథ్ కుమార్తె, నిర్మాత జి వి జి రాజు భార్య అయినటువంటి పద్మజ రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ప్రస్తుతం ఈమె వయసు 54 సంవత్సరాలు ఈమెకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. పద్మజ ప్రముఖ నటుడు కుమార్తె మాత్రమే కాకుండా నిర్మాతకు భార్య కూడా.
ఈమె భర్త జివిజి రాజు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గోకులంలో సీత తొలిప్రేమ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక తన భర్త రాజు నిర్మించే సినిమాలకు ఈమె సమర్పకు రాలిగా కూడా పనిచేశారు. ఇకపోతే ఈమె తన తండ్రి హరినాథ్ గురించి అందాల నటుడు అనే పేరిట ఒక పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ దివంగత నటుడు కృష్ణ గారి చేతుల మీద ఆవిష్కరించారు.
ఈ పుస్తకావిష్కరణ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి పద్మారాజు త్వరలోనే తన కుమారులలో ఒకరిని ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం చేయబోతున్నానని అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని వచ్చే ఏడాది తన కుమారుడు నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలియజేశారు. అయితే తన కుమారుడిని నిర్మాతగా కూడా చూడకుండా ఈమె మరణించడంతో ఈమె ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…