Actor Harinath: ఈ ఏడాది ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అలాగే వారి కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. ఇలా ఈ ఏడాది ఎంతోమంది సెలబ్రిటీలను ఇండస్ట్రీ కోల్పోయిందని చెప్పాలి. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు హరినాథ్ ఇంట్లో కూడా విషాద ఘటన చోటుచేసుకుంది.
సీనియర్ నటుడు హరినాథ్ కుమార్తె, నిర్మాత జి వి జి రాజు భార్య అయినటువంటి పద్మజ రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ప్రస్తుతం ఈమె వయసు 54 సంవత్సరాలు ఈమెకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. పద్మజ ప్రముఖ నటుడు కుమార్తె మాత్రమే కాకుండా నిర్మాతకు భార్య కూడా.
ఈమె భర్త జివిజి రాజు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గోకులంలో సీత తొలిప్రేమ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక తన భర్త రాజు నిర్మించే సినిమాలకు ఈమె సమర్పకు రాలిగా కూడా పనిచేశారు. ఇకపోతే ఈమె తన తండ్రి హరినాథ్ గురించి అందాల నటుడు అనే పేరిట ఒక పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ దివంగత నటుడు కృష్ణ గారి చేతుల మీద ఆవిష్కరించారు.
ఈ పుస్తకావిష్కరణ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి పద్మారాజు త్వరలోనే తన కుమారులలో ఒకరిని ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం చేయబోతున్నానని అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని వచ్చే ఏడాది తన కుమారుడు నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలియజేశారు. అయితే తన కుమారుడిని నిర్మాతగా కూడా చూడకుండా ఈమె మరణించడంతో ఈమె ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…