Telugu Star Anchors Remuneration: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది యాంకర్లుకా రాణిస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో సుమ, అనసూయ, రష్మీ , శ్రీముఖి, రవి ప్రదీప్ ఇలాంటి వారందరూ కూడా యాంకర్లుగా వరుస కార్యక్రమాలు సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో స్టార్ యాంకర్లుగా కొనసాగుతున్నటువంటి ఈ యాంకర్లు ఒక్కో షోకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే.
సుమ కనకాల: సుమ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలను తగ్గించినప్పటికీ ఈమె మాత్రం వరుస సినిమా ఈవెంట్లు సక్సెస్ మీట్ కార్యక్రమాలను చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ సినిమా ఈవెంట్లలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్న ఒక్కో షో కి సుమారు మూడు నుంచి ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట.
ప్రదీప్: మేల్ యాంకర్లలో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి ప్రదీప్ ఒక్కోషొకి రెండు నుంచి నాలుగు లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారు. ఇక బుల్లితెర కార్యక్రమాలలో ఒక్కో ఎపిసోడ్ కు రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారట.
అనసూయ: గ్లామరస్ యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న అనసూయ ఒక్కో షో కి రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
రష్మీ: ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న రష్మీ ఒక్కో ఎపిసోడ్ కి 1.5 నుంచి 2 లక్షల వరకు డిమాండ్ చేస్తారట.
రవి: యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రవి ఈ మధ్యకాలంలో కాస్త బుల్లితెరకు దూరమైనప్పటికీ ఈయన ఒక్కో ఎపిసోడ్ కు లక్ష నుంచి 1.5 వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారట. ఇక మంజూష శ్యామల, వర్షిని వంటి వారు ఒక్కో షో కి 50,000 వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…