Actor Praksh Raj : విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ సినిమాలే కాకుండా ప్రస్తుతం పాలిటిక్స్ లోనూ విలక్షణంగానే ఉన్నాడు. ప్రకాష్ రాజ్ సొంత రాష్ట్రం కర్ణాటకలో చదువుకునే రోజుల్లో ఎన్నో డ్రామాలలో నటించిన ప్రకాష్ ఆ తరువాత తమిళ సినిమా ద్వారా సినిమాకు పరిచయమైయ్యాడు. ఆ తరువాత తెలుగు, మలయాళం అంటూ అన్ని భాషలలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా ఏదైనా పాత్ర ఏదైనా ప్రకాశ్ రాజ్ నటన సినిమాకు ప్లస్ అనేలా ఆయన నటిస్తారు. నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు అంటూ విలనిజం చూపించినా, అంతఃపురంలో ఫ్యాక్షన్ నేతగా చేసినా, ఖడ్గంలో ఒక భారతీయ ముస్లింగా నటించినా అన్నింటిలోనూ తన పాత్రకు న్యాయం చేసాడు ప్రకాష్ రాజ్. తాజాగా కృష్ణ వంశీ డైరెక్షన్ లో రంగమార్తాండ సినిమాలో నటించిన ఆయన ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.
అందరికీ అన్నయ్య అందుకే ఆయన వాయిస్…
ప్రకాష్ రాజ్ గారు మెయిన్ లీడర్ గా ఒక రంగస్థల నటుడుగా చేసిన సినిమా రంగమార్తాండ. ఈ సినిమాలో నాటకంలో పాత్రకు న్యాయం చేయగల వ్యక్తి నిజజీవితంలోని పాత్రకు న్యాయం చేయని వ్యక్తిగా మిగులుతాడు. ఈ కథను కృష్ణ వంశీ చక్కగా క్యారీ చేసాడు, భావోద్వేగాలు చక్కగా పండాయి అంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇక సినిమా కథ మరాఠి సినిమా నట సామ్రాట్ నుండి తీసుకున్నది. అయితే మొదట ఆ సినిమా డైరెక్షన్ చేయాలనుకున్నది ప్రకాష్ రాజ్ గారే కానీ చివరికి కృష్ణ వంశీ గారికి ఇచ్చేసారు. ఈ విషయం గురించి చెబుతూ నేను నటుడుగా ఆ పాత్రకు సపూర్ణంగా న్యాయం చేయాలంటే నేను దర్శకత్వ బాధ్యతల నుండి పక్కకు రావాలి. అంత మంచి కథ నా కన్నా మంచిగా డైరెక్ట్ చేసే వ్యక్తి చేతిలో పెట్టడం సబబు అనిపించింది. కృష్ణ వంశీ అయితే ఈ కథ బాగా హ్యాండిల్ చేస్తాడనిపించి ఇచ్చాను.
నా నిర్ణయం కరెక్ట్ అనిపించింది అంటూ చెప్పారు. ఇక ఈ సినిమాకు మరో హైలైట్ చిరంజీవి గారి వాయిస్ ఓవర్. దాన్ని గురించి మాట్లాడుతూ ఆయన గొప్ప నటుడు, ఆయన ఈ సినిమాలో నటుల గురించి చెబితే బాగుంటుంది అనిపించింది. అదీ కాక ఆయనను మించి ఆ డైలాగు చెప్పేందుకు ఇంకెవరికి ఉంది ఆ స్థాయి అనిపించింది. ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు నేడు పెద్దవాళ్ళు అయిపోయినా ఇప్పటికీ యూత్ ఆయన ఫ్ఫాన్స్ గా ఉంటున్నారు. అంతకంటే గొప్ప నటుడు ఎవరు. ఆయన చెబితేనే అక్కడ కరెక్ట్ అనిపించింది అంటూ ఆయన ఊరికే అందరికీ అన్నయ్య అయిపోలేదు కదా అంటూ మాట్లాడారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…