Mohan Babu: మంచు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో మనోజ్ ఒకరు. కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించిన ఈయన గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇకపోతే తాజాగా ఈయన వాట్ ది ఫిష్ అనే సినిమాని ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.ఇకపోతే మనోజ్ మార్చి మూడవ తేదీ అతి కొద్ది మంది బంధువులు కుటుంబ సభ్యుల సమక్షంలో రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా మనోజ్ భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్నారు. ఇక ఈ వివాహం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదని అందుకే ఈ పెళ్లి బాధ్యత మంచు లక్ష్మి తీసుకుందంటూ వార్తలు వినిపించాయి. ఇక ఈ పెళ్లికి మోహన్ బాబు కూడా హాజరుకారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలు అవాస్తవమని మోహన్ బాబు దంపతులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇకపోతే మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన మనోజ్ పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ మనోజ్ మౌనిక గురించి తనకు ముందే చెప్పారని,తన నిర్ణయం విన్న తర్వాత ఒకసారి ఆలోచించుకో అని చెప్పాను. అప్పుడు నాన్న నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని భావిస్తున్నానని చెప్పగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పానని తెలిపారు.
ఇక ఈ పెళ్లి గురించి చాలామంది విమర్శలు చేశారు. ఆ విమర్శలపై మోహన్ బాబు స్పందిస్తూ ఏనుగు తన దారిన తాను వెళుతూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. మనం ఎన్ని కుక్కలని ఆపగలం.మొరిగే కుక్కలను మొరగనివ్వు అంటూ పెళ్లి గురించి విమర్శలు చేసిన వారందరినీ కుక్కలతో పోలుస్తూ ఈయన ఘాటుగా స్పందించారు. ఇలా మోహన్ బాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…