Nayanatara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర తారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నయనతార ఒకరు.సౌత్ ఇండస్ట్రీలోని అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి నయనతార ప్రస్తుతం సినిమాలను కాస్త తగ్గించిందని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తున్నారు.
తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు.ఈ సినిమా కోసం నయనతార ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఇలా సౌత్ ఇండస్ట్రీలో 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి ఏకైక నటి నయనతార అని మాత్రమే చెప్పాలి.
శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ రెండవ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జవాన్ సినిమా కోసం నయనతార ఒక సన్నివేశంలో ఏకంగా బికినీ కూడా ధరించిందని తెలుస్తుంది.ఇలా ఈ సినిమా ద్వారా ఈమె అభిమానులకు బికినీ ట్రీట్ ఇవ్వబోతున్నారనే వార్త వైరల్ గా మారింది.
ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఒకింత షాక్ అవుతున్నారు.ఈ మధ్యకాలంలో నయనతార నటించిన సినిమాలన్నింటిలో కూడా ఈమె పెద్దగా గ్లామర్ షో చేయడం లేదు అలాంటిది ఏకంగా బికినీ ధరించిందనే వార్త తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.ఇలా ఈ సినిమాలో బికినీ ధరించే సీన్స్ ఉండటం వల్లనే ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేసిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…