Actor Siva Krishna : సినిమా ఇండస్ట్రీ మొదట్లో చెన్నై కేంద్రంగా ఉండేది. ఆరోజుల్లో మొత్తంగా సౌత్ కి మద్రాస్ లోనే సినిమా షూటింగ్స్ అన్ని జరిగేవి. ఆ తరువాత తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి చొరవ అలాగే అగ్రహీరోలైన నాగేశ్వరావు గారు రామారావు గారి చొరవతో ఇండస్ట్రీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో స్టూడియోస్ అలాగే డబ్బింగ్ థియేటర్స్ ఇలా అన్ని ఒక్కొక్కటిగా వచ్చేసాయి. సినిమా తీయాలంటే హైదరాబాద్ నగరంలో అన్ని వసతులు ఉన్నాయి అనేలా తయారైంది. అయితే కాలక్రమంలో రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా ఉన్నాయి. దీంతో సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కు తరలి రావాలి అంటూ ఇక్కడి ప్రభుత్వం కోరుకుంటోంది. ఇండస్ట్రీ వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయాని అందువల్ల ఇక్కడ స్టూడయో లు నిర్మించి షూటింగులు చేయాలని సూచించారు. అయితే ఇవేవి జరిగే పనులు కాదంటూ సీనియర్ నటుడు శివ కృష్ణ అభిప్రాయపడుతున్నారు.
ఇండస్ట్రీ ఏపీకి రావడం అసాధ్యం…
నటుడు శివ కృష్ణ గారు మాట్లాడుతూ పెద్ధ హీరోలందరూ మా సినిమాలకు తొడ్పాటు ఇవ్వండి అంటూ ఏపీ సీఎం జగన్ తో భేటీ అవ్వడం అన్నీ మీడియా ముందు బాగానే ఉంటాయి. అలాగే సీఎం కూడా ఇక్కడ స్టూడియోలు కట్టండి ప్రభుత్వం సహాయం చేస్తుంది అని చెప్పడం కూడా పైకి చెప్పే మాటలే కానీ అవన్నీ జరిగే పనులు కాదు అంటూ చెప్పారు.
స్టూడియోలు కట్టాలంటే ఇండస్ట్రీలో ఏ ఒక్కరి వల్లో కాదు కదా ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి, స్థలం చూపించాలి. అలాంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేనపుడు ఆల్రడీ కంఫర్టబల్ గా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎందుకు ఏపీలో స్టూడియోలు కడతారు అంటూ చెప్పారు శివ కృష్ణ.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…