Actress Aamani: తెలుగు ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటీమనులలో ఆమని ఒకరు ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూ స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆమని తన సినిమాల గురించి పలు విషయాలను తెలియచేశారు.
ముఖ్యంగా ఈమె నటించిన జంబలకడిపంబ సినిమా గురించి పలు విషయాలు తెలియజేశారు. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇవివి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాలో ఆడవాళ్లు మగవారిగాను మగవారు ఆడవాళ్ళగానో మారడం చాలా కొత్తదనంగా అనిపించింది. ఇప్పటికీ ఈ సినిమా చూసిన చాలా వినోద భరితంగా ఉంటుందని చెప్పాలి.
ఇక ఈ సినిమాలో నరేష్ ఆమని జంటగా నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఆమని తెలియజేశారు.ఈ సినిమాలో ఆడవారు మగవారిగాను మగవారు ఆడవారిగాను నటించాల్సి వచ్చింది. అయితే ఓ సందర్భంలో తాను సిగరెట్ కాలుస్తూ మందు తాగాల్సిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అయితే ఈ విషయం డైరెక్టర్ గారు నాకు ముందుగా చెప్పలేదు.కేవలం బాటిల్ ఓపెన్ చేయగానే మందు మొత్తం పైకి పొంగుతుంది జస్ట్ ఒక సిప్ చేస్తే చాలు అని షూటింగ్ కు ముందు డైరెక్టర్ చెప్పారు.
ఇక బాటిల్లో కూల్ డ్రింక్ వేసి ఇస్తారని తాను అనుకున్నాను కానీ నిజంగానే నిజమైన బీర్ బాటిల్ తీసుకువచ్చారని ఆమని తెలిపారు.ఈ సినిమాలోని సన్నివేశం షూట్ చేసే సమయంలో హీరో నరేష్ గారు కూడా ఏం పర్వాలేదు తాగమ్మా అంటూ తనని బీర్ తాగమని ప్రోత్సహించారు అంటూ అప్పటి సంఘటనలను ఆమని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇలా ఆమని చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…