Actress Charmi: టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుకోకుండా ఒక రోజు, శ్రీ ఆంజనేయం, నిజం, మంత్ర, మాస్, రాఖి వంటి ఎన్నో సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఛార్మి ప్రస్తుతం తెరపై ప్రేక్షకులను సందడి చేయడం లేదు. ఇలా ఈమె తెరపై కనిపించకపోయిన తెర వెనుక సినిమాను నడిపిస్తున్నారు. నిర్మాతగా మారి పూరి జగన్నాథ్ తో కలిసి పలు సినిమాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా పూరి నిర్మాణంలో భాగస్వామ్యం అయిన ఛార్మి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక చార్మి ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఇంకా ఈమెకు ఏ విధమైనటువంటి క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. సినిమాలలో నటించకపోయిన నిర్మాతగా ఉన్నప్పటికీ ఈమె సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే చార్మి సినిమాలలోకి వచ్చిన తర్వాత ఈమె సంపాదించిన ఆస్తులు విలువ కనక తెలిస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోవాల్సిందే.
2019లో నిర్వహించిన ఓ సర్వేలో భాగంగా చార్మి ఏకంగా రెండు మిలియన్ డాలర్ల ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ నాలుగేళ్లలో ఈమె ఆస్తులు విలువ మరింత పెరిగే ఉంటాయనడంలో ఆశ్చర్యం లేదు.ఇక చార్మి హైదరాబాదులో ఎంతో ఖరీదైన అపార్ట్మెంట్ తో పాటు ఎన్నో ఫ్లాట్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అదేవిధంగా ముంబైలో కూడా కోట్లు విలువచేసే మూడు నాలుగు అపార్ట్మెంట్లో ఉన్నాయని సమాచారం.
అదేవిధంగా రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసి బీఎండబ్ల్యూ 730 LD కారును కొనుక్కున్నారు. ఇవే కాకుండా మరికొన్ని కార్లు కూడా తన గ్యారేజ్ లో ఉన్నాయి. ఇలా కోట్ల రూపాయల విలువచేసే కార్లు కొనుగోలు చేస్తూ ఖరీదైన బంగ్లాలను కొనుగోలు చేసి భారీగా ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చార్మి ఈ రెండు దశాబ్దాల కాలంలో ఈ రేంజ్ లో ఆస్తులను కూడా పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇకపోతే ప్రస్తుతం ఈమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పెరికెక్కిన లైగర్ సినిమా నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయ్యారు. ఈ సినిమా ఈనెల 25వ తేదీ విడుదల కానుంది
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…