Actress Jayaprada: సీనియర్ నటి బిజెపి నాయకురాలు జయప్రద పై ఉత్తర ప్రదేశ్ రాంపూర్ హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కోర్టు జయప్రద పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.అయితే కోర్టు ఈమెకు నోటీసులు జారీ చేయడానికి గల కారణం ఈమె ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే కారణమని తెలుస్తోంది.
2019 లోక్ సభ ఎన్నికల సమయంలో భాగంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈమెపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించినప్పటికీ జయప్రద మాత్రం విచారణకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఈమె పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది అమర్ నాథ్ తివారి వెల్లడించారు.ఇలా రాంపూర్ కోర్టులో జయప్రదకు నోటీసులు జారీ చేయడమే కాకుండా వచ్చే మంగళవారం విచారణకు హాజరుకావాలని సూచించింది. ఇలా ఈమెను మంగళవారం విచారణకు తీసుకురావాల్సిందిగా కోర్టు రాంపూర్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ లకు ఆదేశాలు జారీచేసింది.
ఇక ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసినట్లు వెల్లడించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో ఈమె ప్రచార కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున బహిరంగ సభలను నిర్వహిస్తూ నిబంధనలను ఉల్లంఘించారన్న నేపథ్యంలోనే ఈమె ఈ విధమైనటువంటి కేసులో నమోదు అయ్యాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…