Actress Laila: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటి లైలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ 2004వ సంవత్సరంలో మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా అనంతరం ఈమె తెలుగు తెరకు పూర్తిగా దూరమయ్యారు.
ఇక లైలా 2019 వ సంవత్సరంలో ఓ తమిళ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు అలాగే 2020వ సంవత్సరంలో ఓ సీరియల్ లో కనిపించి సందడి చేసిన లైలా ఈ మధ్యకాలంలో మీడియాకు చాలా దూరంగా ఉన్నారు.ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్టు తెలుస్తుంది. వెండితెరకు దూరమై కొన్ని సంవత్సరాలు గడిచిన అనంతరం ఈమె కార్తీ నటిస్తున్న సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.
తమిళనాడు కార్తీ హీరోగా నటిస్తున్న చిత్రం సర్దార్. ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు భాషలో కూడా విడుదల కానుంది తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమా విడుదల కానుంది.ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లైలా సందడి చేశారు.
ఈ వేడుకలో లైలా మాట్లాడుతూ తాను 2003లో శివపుత్రుడు సినిమాలో చేశాను. అయితే ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా విడుదలైంది.ఇక ఇప్పుడు సర్దార్ సినిమా కూడా దీపావళి పండుగ సందర్భంగా విడుదల కాబోతుంది. ఇక అదే రోజు నా పుట్టిన రోజు కావడం ఎంతో సంతోషంగా ఉంది.ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డాము ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని అలాగే ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరించాలని ఈమె కోరుకోవడమే కాకుండా నా తెలుగు కుటుంబానికి ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా లైలా ఈ కార్యక్రమంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…