నటి మాధవి లత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సామాజిక విషయాలపై దృష్టి సారిస్తోంది.ఈ క్రమంలోనే పలు విషయాలపై ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎన్నో వివాదాలకు కారణమవుతుంటారు.
తాజాగా ఈ నటి సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా చేసిన పోస్టులు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఈ క్రమంలోనే మాధవిలత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో బిగ్ బాస్ గురించి తెలియజేశారు.
బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్ లో భాగంగా షణ్ముఖ తన లెటర్ ని వదులుకొని నామినేట్ అయ్యారు.అయితే అందులో తన తల్లి గురించి చెబుతూ భావోద్వేగమైన సంగతిని మాధవీలత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ షణ్ముఖ గురించి ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే మాధవీలత మాట్లాడుతూ ఇలాంటి వాళ్లకుఎదురుగా మాట్లాడటం చేతకాదు గాని పక్కన ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లు ఎంత చించుకున్నా కాకి-కోకిల కాలేదు కదా సోఫా స్టార్ అంటూ తెలియజేశారు.
అలాగే బిగ్ బాస్ హౌస్ లో భాగంగా కెప్టెన్సీ కంటెంట్ కోసంలో పాల్గొన్నటువంటి ముత్యాల టాస్క్ లో భాగంగా షణ్ముఖ్ ముత్యాలను నీటిగా తీయలేకపోయాడు.ఇదే విషయాన్ని శ్రీరామ్ రవి చెప్పినప్పటికీ సంచాలకులుగా ఉన్నటువంటి సన్నీ డెసిషన్ తీసుకొన్న నిర్ణయం సరికాదంటూ తెలియజేసింది.
హౌస్ లో ఉన్న సిరి తప్ప మిగిలిన అందరూ కూడా లోబోకి ఓటు వేశారు నేను కూడా లోబోకి సపోర్ట్ చేస్తున్నా అంటూ తెలియజేసింది.ఇక హౌస్ లో ప్రవేశించిన సిరి షణ్ముఖ్ కాఫీ కలుపుకొని తాగుదాం చాలా స్ట్రాంగ్ గా కలుపుకుందాం మళ్లీ దొరకదు అంటూ మాట్లాడగా ఈ విషయంపై స్పందించిన మాధవిలత సెల్ఫిష్ అంటూ ఎక్కువ వేసుకోవడానికి ఇదేమైనా మోతిచూర్ లడ్డులోని నెయ్య అంటూ వారి గురించి ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలా షన్ను గురించి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా మాధవీలత పోస్ట్ చేయడంతో వీటిని చూసిన అభిమానులు తీవ్రస్థాయిలో గొడవ పడ్డారు.ఈ క్రమంలోనే ఆమె గురించి అభిమానులు నెగిటివ్గా మాట్లాడుతూ పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వాటిని స్క్రీన్ షార్ట్ తీసుకున్న మాధవిలత అసలు సిసలైన ఆట ఇప్పుడే మొదలైంది అంటూ షన్ను అభిమానులకు సవాల్ విసిరారు.ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ ట్రోలింగ్ నాకు పండగే పెట్టండి ఇలాంటివి చేస్తారో చేయండి మీకు చెర్లోపల్లి కన్ఫామ్ అవి ఎలా ఉండాలి అంటే పదిహేను రోజుల పాటు జైలులో ఉంటూ రెండు సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగే విధంగా మీ మెసేజ్ లు ఉండాలి అంటూ వారికి సవాల్ విసిరింది.
మీరు హర్ట్ అయ్యారు కాబట్టి నాకు వార్నింగ్ ఇచ్చారు. మీరు హర్ట్ అయ్యారు కనుక అసభ్యకర పదజాలంతో నాకు మెసేజ్ లు పెట్టారు అదే నేను హర్ట్ అయితే మీ ప్రొఫైల్స్ సైబర్ జైల్లో ఉంటాయి. నాకు బాగా మండితే మీ మొహాలు చర్లపల్లి జైల్ లో ఉంటాయి అంటూ షన్ను అభిమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…