Connect with us

Featured

సోషల్ మీడియా వేదికగా నటి మాధవీలత.. షన్ను అభిమానుల మధ్య తలెత్తిన గొడవ!

Published

on

నటి మాధవి లత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సామాజిక విషయాలపై దృష్టి సారిస్తోంది.ఈ క్రమంలోనే పలు విషయాలపై ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎన్నో వివాదాలకు కారణమవుతుంటారు.

తాజాగా ఈ నటి సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా చేసిన పోస్టులు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఈ క్రమంలోనే మాధవిలత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో బిగ్ బాస్ గురించి తెలియజేశారు.

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్ లో భాగంగా షణ్ముఖ తన లెటర్ ని వదులుకొని నామినేట్ అయ్యారు.అయితే అందులో తన తల్లి గురించి చెబుతూ భావోద్వేగమైన సంగతిని మాధవీలత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ షణ్ముఖ గురించి ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే మాధవీలత మాట్లాడుతూ ఇలాంటి వాళ్లకుఎదురుగా మాట్లాడటం చేతకాదు గాని పక్కన ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లు ఎంత చించుకున్నా కాకి-కోకిల కాలేదు కదా సోఫా స్టార్ అంటూ తెలియజేశారు.

అలాగే బిగ్ బాస్ హౌస్ లో భాగంగా కెప్టెన్సీ కంటెంట్ కోసంలో పాల్గొన్నటువంటి ముత్యాల టాస్క్ లో భాగంగా షణ్ముఖ్ ముత్యాలను నీటిగా తీయలేకపోయాడు.ఇదే విషయాన్ని శ్రీరామ్ రవి చెప్పినప్పటికీ సంచాలకులుగా ఉన్నటువంటి సన్నీ డెసిషన్ తీసుకొన్న నిర్ణయం సరికాదంటూ తెలియజేసింది.

హౌస్ లో ఉన్న సిరి తప్ప మిగిలిన అందరూ కూడా లోబోకి ఓటు వేశారు నేను కూడా లోబోకి సపోర్ట్ చేస్తున్నా అంటూ తెలియజేసింది.ఇక హౌస్ లో ప్రవేశించిన సిరి షణ్ముఖ్ కాఫీ కలుపుకొని తాగుదాం చాలా స్ట్రాంగ్ గా కలుపుకుందాం మళ్లీ దొరకదు అంటూ మాట్లాడగా ఈ విషయంపై స్పందించిన మాధవిలత సెల్ఫిష్ అంటూ ఎక్కువ వేసుకోవడానికి ఇదేమైనా మోతిచూర్ లడ్డులోని నెయ్య అంటూ వారి గురించి ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇలా షన్ను గురించి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా మాధవీలత పోస్ట్ చేయడంతో వీటిని చూసిన అభిమానులు తీవ్రస్థాయిలో గొడవ పడ్డారు.ఈ క్రమంలోనే ఆమె గురించి అభిమానులు నెగిటివ్గా మాట్లాడుతూ పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వాటిని స్క్రీన్ షార్ట్ తీసుకున్న మాధవిలత అసలు సిసలైన ఆట ఇప్పుడే మొదలైంది అంటూ షన్ను అభిమానులకు సవాల్ విసిరారు.ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ ట్రోలింగ్ నాకు పండగే పెట్టండి ఇలాంటివి చేస్తారో చేయండి మీకు చెర్లోపల్లి కన్ఫామ్ అవి ఎలా ఉండాలి అంటే పదిహేను రోజుల పాటు జైలులో ఉంటూ రెండు సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగే విధంగా మీ మెసేజ్ లు ఉండాలి అంటూ వారికి సవాల్ విసిరింది.

మీరు హర్ట్ అయ్యారు కాబట్టి నాకు వార్నింగ్ ఇచ్చారు. మీరు హర్ట్ అయ్యారు కనుక అసభ్యకర పదజాలంతో నాకు మెసేజ్ లు పెట్టారు అదే నేను హర్ట్ అయితే మీ ప్రొఫైల్స్ సైబర్ జైల్లో ఉంటాయి. నాకు బాగా మండితే మీ మొహాలు చర్లపల్లి జైల్ లో ఉంటాయి అంటూ షన్ను అభిమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది.

Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!