Actress Meena : మీనా దురైరాజ్ 1976లో జన్మించారు మరియు తమిళనాడులోని చెన్నై (అప్పటి మద్రాసు) లో పెరిగారు. ఆమె తల్లి కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందినవారు కాగా, తండ్రి ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు. మీనా తన పాఠశాల విద్యను చెన్నైలోని విద్యోదయ పాఠశాల నుండి పూర్తి చేసేసింది.
మీనా 1982లో “నేంజగల్ ” చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించింది. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్గా డా.శివాజీ గణేషన్తో పాటు పలు చిత్రాలలో నటించింది. ఆమె రజనీకాంత్తో ఎంగేయో కెట్టా కురల్ మరియు అన్బుల్లా అనే రెండు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. అన్బుల్లా రజనీకాంత్, ఇందులో ఆమె రజనీకాంత్కు వేడెక్కే ప్రాణాంతకమైన అనారోగ్యంతో ఉన్న పిల్లవాడిగా నటించింది. ఇది ఆమె కెరీర్ వృద్ధికి ప్రధాన సూచికగా మారింది. ఆ సినిమా విజయం తర్వాత సౌత్ ఇండియన్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకుంది.
సౌత్లో ప్రతి పెద్ద స్టార్తో జతకట్టిన టాప్ స్టార్లలో మీనా ఒకరు. ఆమె 1990లో “నవయుగం”లో రాజేంద్ర ప్రసాద్తో కలిసి తెలుగులోకి అడుగుపెట్టింది. కస్తూరి రాజా దర్శకత్వం వహించిన రాజ్కిరణ్ సరసన తమిళ చిత్రం ఎన్ రసవిన్ మనసిలే (1991) ద్వారా ఆమెకు మొదటి బ్రేక్ వచ్చింది. ఈ రొమాంటిక్ డ్రామా బ్లాక్బస్టర్గా నిలిచింది మరియు ఆ సంవత్సరం అనేక అవార్డులను గెలుచుకుంది. అయితే తెలుగులో ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారి మనవరాలిగా నటించింది. ఆ తర్వాత తమిళ రీమేక్ చిత్రం “చంటి” సినిమాతో తెలుగులో అనేక మంది ప్రేక్షకులను సంపాదించుకుంది.
ఆ తర్వాత చిరంజీవి, బాలయ్య, నాగార్జున, జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి హీరోలతో నటించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. తను హీరోయిన్ అయినా నాటి తొలి రోజులను గుర్తు చేసుకుంటూ.. తమిళ చిత్రం యజమాన్(రౌడీ జమిందార్) సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చినప్పుడు అప్పటికే చంటి సినిమా విడుదలై గ్రామాల్లో ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నా రోజుల్లో.. ఫస్ట్ రోజు, ఫస్ట్ షాట్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆయనతో నటించినప్పుడు అంకుల్ అని పిలిచాను. ఇప్పుడు ఎలా పిలవాలో తెలియక భయంతో రజనీకాంత్ కు గుడ్ మార్నింగ్ చెప్పలేదు.
అక్కడ నన్ను చూసిన ప్రేక్షకులు ఒకటే అరుపులు, కేకలు.. ఆ తర్వాత షెడ్యూలు పూర్తవడంతో తిరిగి చెన్నై వెళుతున్న సమయంలో మేమంతా రైల్వే స్టేషన్ కి చేరుకున్నాం. రజనీకాంత్ హీరోగా నటించిన భాషా, ముత్తు లాంటి సినిమాలు అప్పటికి విడుదల కాకపోవడంతో అక్కడి గ్రామాల్లోని ప్రజలు రజనీకాంత్ ను ఎవరు గుర్తుపట్టలేదు.. ప్రేక్షకులు మళ్లీ నన్ను చూసి కేకలు పెట్టడాన్ని నేను ఆనందపడాలో, రజనీకాంత్ ను పట్టించుకోవడం లేదని బాధపడాలో అర్థం కాలేదు. ఎలాగో అలాగా నా అసిస్టెంట్స్ సహాయంతో ట్రైన్ ఎక్కాను.. రజిని ఏమనుకుంటున్నారో అనే భయం లోపల ఎక్కడో ఉంది. కానీ కాసేపటికి ఎవరో నా కంపార్ట్మెంట్ లోకి వచ్చి డోర్ కొట్టారు. ఏమిటాని చూసేసరికి రజనీకాంత్ కనబడ్డారు. నన్ను చూసి చిరునవ్వుతో.. తెలుగులో నీకు ఇంతమంది అభిమానులు ఉన్నారా? అని కంగ్రాట్స్ చెప్పి గాడ్ బ్లెస్స్ యు అంటూ నన్ను అభినందించారని ఆ ఇంటర్వ్యూలో మీనా చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…