Actress Meena: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించిన మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనా పెళ్లయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా తెలుగులో ఈమె సన్నాఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను సందడి చేశారు.ఈ సినిమా తర్వాత పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మీనా వరుస షూటింగ్లలో పాల్గొంటున్న సమయంలో తన భర్త మరణ వార్త తనని కృంగదీసింది. తన భర్త విద్యాసాగర్ అకాల మరణంతో మీనా దుఃఖసాగరంలోకి వెళ్లిపోయింది. మీనా భర్త మరణ వార్త తెలియగానే ఎంతోమంది సినీ ప్రముఖులు ఆమెను పరామర్శించి తనకు ధైర్యం చెప్పారు.
ఇక భర్త మరణం తర్వాత బయటకురాని మీన మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చారు.ఇకపోతే ఈమె ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈమె తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే షూటింగ్ లొకేషన్లో నటి కిరీటీ రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. జులై 19వ తేదీ ఈయన పుట్టినరోజు కావడంతో ఈయన పుట్టినరోజు సందర్భంగా అలీ తన భార్య జుబేదా కూడా హాజరయ్యారు.ఈ క్రమంలోనే జుబేదా మీనా గారితో మాట్లాడుతూ ఉన్న వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో జుబేదా మీనా గారిని మొదటిసారి ఎప్పుడు కలిశారనే విషయాన్ని చెబుతూ అందుకు సంబంధించిన ఫోటోలను మీనాకు చూపించారు.ఇకపోతే ఈ వీడియోని ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు సైతం మీనాని తిరిగి ఇలా చూడడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…