ఇప్పుడు సినీ పరిశ్రమలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే అని చెప్పవచ్చు. వరుస సినిమాలతో ఆమె మస్తు బిజీగా ఉన్నారు. తన అంద చందాలతో, నటనతో కుర్రకారులను కట్టిపడేస్తుంది.
మొదట అక్కినేని నాగచైతన్య సరసన ‘ఒక లైలా కోసం’ అనే సినిమాలో నటించిన ఈ బుట్టబొమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. ఇటు బాలీవుడ్ లో కూడా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలతో నటించింది. ప్రస్తుతం తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు సిద్ధం అయింది.
విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. అయితే విజయదశమి రోజును విడుదల అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో పూజా.. అక్కినేని అఖిల్ తో జత కట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక త్వరలో ప్రభాస్ నటించిన సినిమా రాధేశ్యామ్ లో కూడా నటించింది. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇంత బిజీగా ఉన్న పూజా హెగ్డే సంపాదన ఎంతో తెలుసుకోవాలని చాలామందికి అనిపిస్తుంటుంది. అయితే కొన్ని వార్తలు ఆమె రెమ్యూనరేషన్ మీద సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం పూజా ఒక్క సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ. 4కోట్ల వరకు తీసుకుంటోందట. ఇంకా మున్ముందు ఆమె రెమ్యూనరేషన్ పెరిగే అవకాశం కూడా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె అటు యాడ్స్ లో కూడా నటిస్తోంది కనుక దాదాపు ఆమె సంపాదన రూ.50 కోట్ల నుంచి రూ. 70 కోట్ల మధ్యలో ఉన్నట్లు సినీ వర్గాల టాక్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…