Actress Poojitha: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏదైనా హాట్ టాపిక్ గా మారిందా అంటే అది కేవలం నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం మాత్రమే అని చెప్పాలి.వీరిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తూ ఉన్నారు. అయితే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నామని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేముందు వీరిద్దరూ కేక్ కట్ చేసి ఒకరికొకరు లిప్ లాక్ పెట్టుకున్నటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పెళ్లి చేసుకోబోతున్నాం మీ ఆశీర్వాదం కావాలి అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున నేటిజన్స్ ఈ వీడియో పై తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు.
తాజాగా నరేష్ పవిత్ర వ్యవహారం గురించి నటి పూజిత షాకింగ్ కామెంట్స్ చేశారు. నరేష్ వ్యక్తిగతంగా చాలా మంచివాడని ఆయన ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే మంచి స్వభావం కలవాడని పూజిత తెలిపారు. తానుకష్టాల్లో ఉన్న సమయంలో కొంత సహాయం కావాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి లెటర్ రాసిన ఎవరి నుంచి సహాయం అందలేదు కానీ తనకు నరేష్ సహాయం చేసి ఆదుకున్నారని తెలిపారు.
ఇక నరేష్ మా అసోసియేషన్ మెంబర్స్ కి కళ్యాణ లక్ష్మి పథకం పెన్షన్ స్కీమ్ వంటి ఎన్నో ఉచిత పథకాలను అమలులోకి తీసుకువచ్చారు. అయితే ఎంతో మందికి ఇలా మంచి చేస్తున్నటువంటి ఈయన తనకు మంచి స్నేహితుడిగా మారారని తెలిపారు.ఈ విధంగా నరేష్ వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అయినప్పటికీ ఈయన మాత్రం తన నెత్తిమీద శని గ్రహాన్ని పెట్టుకు తిరుగుతున్నారంటూ ఈమె షాకింగ్ కామెంట్ చేశారు. మరి పూజిత శనిగ్రహం అన్నది పవిత్ర లోకేష్ నేనా లేక మరెవరిని ఉద్దేశించి అన్నారనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…