Actress Poojitha: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏదైనా హాట్ టాపిక్ గా మారిందా అంటే అది కేవలం నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం మాత్రమే అని చెప్పాలి.వీరిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తూ ఉన్నారు. అయితే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నామని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేముందు వీరిద్దరూ కేక్ కట్ చేసి ఒకరికొకరు లిప్ లాక్ పెట్టుకున్నటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పెళ్లి చేసుకోబోతున్నాం మీ ఆశీర్వాదం కావాలి అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున నేటిజన్స్ ఈ వీడియో పై తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు.
తాజాగా నరేష్ పవిత్ర వ్యవహారం గురించి నటి పూజిత షాకింగ్ కామెంట్స్ చేశారు. నరేష్ వ్యక్తిగతంగా చాలా మంచివాడని ఆయన ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే మంచి స్వభావం కలవాడని పూజిత తెలిపారు. తానుకష్టాల్లో ఉన్న సమయంలో కొంత సహాయం కావాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి లెటర్ రాసిన ఎవరి నుంచి సహాయం అందలేదు కానీ తనకు నరేష్ సహాయం చేసి ఆదుకున్నారని తెలిపారు.
ఇక నరేష్ మా అసోసియేషన్ మెంబర్స్ కి కళ్యాణ లక్ష్మి పథకం పెన్షన్ స్కీమ్ వంటి ఎన్నో ఉచిత పథకాలను అమలులోకి తీసుకువచ్చారు. అయితే ఎంతో మందికి ఇలా మంచి చేస్తున్నటువంటి ఈయన తనకు మంచి స్నేహితుడిగా మారారని తెలిపారు.ఈ విధంగా నరేష్ వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అయినప్పటికీ ఈయన మాత్రం తన నెత్తిమీద శని గ్రహాన్ని పెట్టుకు తిరుగుతున్నారంటూ ఈమె షాకింగ్ కామెంట్ చేశారు. మరి పూజిత శనిగ్రహం అన్నది పవిత్ర లోకేష్ నేనా లేక మరెవరిని ఉద్దేశించి అన్నారనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…